టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ మరియు మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందన సంపాదించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు పెంచడం జరిగింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్

 

మురళి శర్మ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్, సంగీత, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న తమ హీరో, తప్పకుండా ఈ సినిమాతో మరొక హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ విషయమై నేడు ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రసారం అవుతోంది. దానిని బట్టి ఈ సినిమాకు ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఖర్చు అయిందని, అందులో రూ.65 కోట్లవరకు ఆర్టిస్టుల రెమ్యునరేషన్ అవ్వగా, 

 

మిగతా రూ.35 కోట్లు సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అని అంటున్నారు. నిజానికి మొదట ఈ సినిమా రూ.90 కోట్ల లోపే అవుతుంది అనుకున్నప్పటికీ, కర్నూల్ లో షూటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో కర్నూల్ సెట్టింగ్ ని హైదరాబాద్ లో వేయడం వలన సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మరింత పెరిగి ఫైనల్ గా రూ.100 కోట్ల వరకు చేరిందని అంటున్నారు. ఇక కొన్నేళ్ల తరువాత తన కం బ్యాక్ సినిమాను మహేష్ తో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, తన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంతో బాగా వస్తోందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని విజయశాంతి తన సన్నిహితుల వద్ద నమ్మకం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: