సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి మరో సారి సంచలనానికి తెర తీసింది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ పశు వైద్యురాలు దిశ పై హత్యాచారం చేసిన నలుగురు నిందితులు తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులను ప్రజానీకం, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు కొనియాడుతున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే శ్రీ రెడ్డి కూడా దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. "దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులకు సెల్యూట్, రేపిస్టులకు తగిన శాస్తి జరిగింది, జై కెసిఆర్" అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు శ్రీ రెడ్డి. 

 

అంతటితో ఆగకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఒక సంచలన పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి "ఏపీ పోలీసులకు ఒక విన్నపం, పీకే లాగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళని కూడా ఎన్‌కౌంటర్‌ చెయ్యాలి" అంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ ను మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీ రెడ్డి మరో సారి రెచ్చిపోయింది. 

 

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారిన శ్రీ రెడ్డి, ఇక అప్పటి నుంచి ఎవరి మీదో ఒకరి మీద ఆరోపణలు చేస్తూ మీడియాలో ప్రతీ రోజు ఏదో ఒక వార్త ద్వారా న్యూస్ లో ఉంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసి మరోమారు వార్తల్లో నిలిచారు శ్రీ రెడ్డి. ఇక శ్రీ రెడ్డి పోస్టుపై పవన్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. పీకే ను అనే ముందు నువ్వు నీ సంగతి చూసుకో, పీకే ను విమర్శించే అర్హత నీకు లేదంటూ శ్రీ రెడ్డి కి చురకలు అంటిస్తున్నారు పీకే ఫాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: