ఇండియాలో బిగ్ హోస్ షో కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో వలన కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఇండియాలో అత్యధిక ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోగా బిగ్ బాస్ మారిపోయింది. ముందుగా హిందీలో మొదలై.. అక్కడ ఇప్పటికే 12 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు 13వ సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 13 ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయింది. అయితే కాంట్రవర్సీలు ఎన్ని ఏర్పడినా.. షో మాత్రం రేటింగ్ పరంగా దూసుకుపోతుంది. బిగ్ బాస్ నాలుగోవ సీజన్ నుంచి ఈ షో కి సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూన్నాడు. షో రేంజ్ పెరుగుతూ వస్తున్న కొద్ది సల్మాన్ పారితోషికం కూడా పెరుగుతూ వస్తుంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. కొందరు ఈ షోలో కలిసిన తర్వాత ప్రేమికులయ్యారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ సీన్ మళ్లీ రిపీట్ అవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్, పునర్నవి తెలుగు రాష్ట్రాల్లో యమ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ జంట బిగ్ బాస్ హౌజ్లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ జంట కెమిస్ట్రీని చూడటానికి చాలా మంది ఇష్ట పడేవారు. అయితే ఈ జంట మాదిరిగానే సల్మాన్ ఖాన్ హోస్ట్గా చేస్తున్న బాస్ సీజన్ 13 లో రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ లవ్ స్టోరీ నడుస్తుంది. రోజురోజుకీ ఓ సర్ప్రైజ్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్.. ఇక ఇప్పుడు షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
బిగ్ బాస్ ప్రస్తుత సీజన్లో నటుడు సిద్ధార్థ్ శుక్లా తర్వాత అంత స్ట్రాంగ్ ఉన్నది రష్మీ దేశాయ్ ఒక్కరే. అయితే రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ లవ్ స్టోరీ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. అయితే గత వారమే నటుడు అర్హన్ ఖాన్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి గతంలో రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ లవర్స్.. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ వేదికగా కలిశారు. మరో విషయం ఏంటంటే.. తన ప్రేమను తెలపడానికి బంగారు ఉంగరంతో అర్హన్ ఖాన్ వచ్చినా.. రష్మీ ఏమి తెలియనట్టుగా ప్రదర్శించడం షాక్కు గురిచేసింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఈ జంటకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే.. రష్మీ, అర్హన్ ఖాన్లు బిగ్ బాస్ హౌస్లో పెళ్లి చేసుకుంటే.. ఏకంగా 2 కోట్లు పెళ్లి కానుకగా ఇస్తానని చెప్పి సంచలనం సృష్టించాడు. మరి ఈ జంట ఈ ఆఫర్పై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.