తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటంతో ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్‌ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

దిశ ఎన్‌కౌంటర్ జరిగి 24 గంటలైనా గడవనే లేదు.. మహిళలపై వేధింపుల పరంపర కొనసాగుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఓ మహిళ పట్ల నలుగురు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు మూకుమ్మడిగా తిరగబడి ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేయగా మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం.

 


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం మాత్రం జనసేన వైసీపీల మధ్య మాటల యుద్దానికి కారణమైంది..రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు’ అని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఒక దినపత్రికలో ప్రచురితమైంది. ఈ వార్తను ఆధారంగా చేసుకుని కొంతమంది వైసీపీ నేతలు, పవన్ కళ్యాణ్‌ను ద్వేషించేవారు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అలాంటి వారిపై ఇప్పుడు పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు విరుచుకుపడ్డారు. 

 

పవన్ ఏమన్నాడో కరెక్ట్‌గా వినండి. విని మాట్లాడండి. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే బాపతు ఆలోచనలు పక్కనపెట్టండి. మీకేనా నోటికి వచ్చినంత మాట్లాడే దమ్ము ధైర్యం ఉంది. మాకు చేతకాదా? మేం మాట్లాడలేమా? వైసీపీ లీడర్స్ ఎన్నోన్నో చెబుతున్నారు.. మాకు చేతకాదా? మాకు సంస్కారం ఉంది కాబట్టి అనిగి ఉన్నాం. మీకు లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది మీ వివేకానికే వదిలేస్తున్నాం’’ అంటూ నాగబాబు  తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: