అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా పెరిగి పోవడంతో ఈ మూవీని భారీ రేట్లకు బయ్యర్లకు అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈమూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో పోటీ పడుతున్న నేపధ్యంలో ఈ మూవీ నిర్మాతలు కోరిన భారీ రేట్లను ఇవ్వడానికి బయ్యర్లు జంకారు అన్నవార్తలు వచ్చాయి.

దీనితో ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ అమెజాన్ లో రాదు అంటూ ఒక ప్రకటన కూడ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాట మార్చి ‘అల వైకుంఠపురములో’ మూవీని నెట్ ఫ్లిక్స్ లో కూడ విడుదల చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఈ సంస్థ ప్రతినిధులతో ఇప్పుడు బేరసారాలు ఆడుతున్నట్లు ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక న్యూస్ బయట  పెట్టింది. 

దీనితో బన్నీ మూవీకి అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగబోవడంతో ఇప్పుడు నిర్మాతలు తమ రూట్ మార్చి ఇలా నెట్ ఫ్లిక్స్ వైపు యూటర్న్ తీసుకున్నారా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి సంబంధించి మరొక ఆసక్తికర విషయం లీక్ అయింది. 

అందరూ అనుకుంటున్నట్లుగా ఈ మూవీలో విలన్ పాత్ర చేస్తున్నది నవదీప్ కాదనీ ఈ మూవీకి సంబంధించి అసలు విలన్ మురళీ శర్మ అంటూ మరో లీక్ బయటకు వస్తోంది. అంతేకాదు ఈ మూవీలో ఇంకా ఇలాంటి ట్విస్ట్ లు అనేకం ఉంటాయని ప్రతి ట్విస్ట్ కథతో కనెక్ట్ అయ్యే విధంగా త్రివిక్రమ్మూవీ కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ మూవీ చూసే ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచుతుంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఒక బలమైన కథతో పాటు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ‘అల వైకుంఠపురములో’ సినిమాను సంక్రాంతి విజేతగా మారుస్తుందని ఈ మూవీ నిర్మాతలు చాల గట్టి నమ్మకం పై ఉన్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: