‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ బడ్జెట్ కు సంబంధించి లీక్ అవుతున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మహేష్ అనీల్ రావిపూడిల పారితోషికాలతో కలుపుకుంటే ఈ మూవీకి నటీ నటుల పారితోషికాల కోసమే 60 కోట్లు ఖర్చు అయింది అని వస్తున్న వార్తలు షాకింగ్ గా మారుతున్నాయి.

మూవీ ప్రొడక్షన్ కాస్ట్ తో కలుపుకుంటే ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు దాటిపోయింది అని అంటున్నారు. వాస్తవానికి మార్కెట్ లో మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ బిజినెస్ చాల సులువుగా జరిగినా ఇప్పుడు ఈ మూవీ గురించి వస్తున్న ఒక లీక్ ఈ మూవీ బయ్యర్లను భయపెడుతున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్నీ ట్రైన్ జర్నీలో కనిపిస్తాయని ఈ మూవీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి మహేష్ రాయలసీమ ప్రాంతంలో ఎంటర్ అయ్యే సీన్స్ తో ఒక భారీ ట్విస్ట్ ను అనీల్ రావిపూడి ఇచ్చాడు అని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీలోని కొన్ని సీన్స్ ను చూసిన వారికి రవితేజ ‘నిప్పు’ సినిమా గుర్తుకు వస్తుందని కూడ లీకులు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ లీకులు ఈ మూవీ బయ్యర్ల వరకు చేరడంతో ఈ ట్రైన్ ప్రయోగాన్ని జనం ఎంతవరకు కనెక్ట్ అవ్వగలరు అన్న సందేహాలతో పాటు అసలు కథ ఇంటర్వెల్ వరకు మొదలు అవ్వకపోతే మితిమీరిన కామెడీ చూసి జనం అసహనానికి లోనవుతారా అంటూ ఈ మూవీ బయ్యర్లకు కొత్త భయాలు పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ‘అల వైకుంఠపురములో’ సినిమాకి పెరిగిపోతున్న మ్యానియా ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి పాటకు వచ్చిన మిశ్రమ స్పందన ఈ మూవీ బయ్యర్లకు నిద్రలేని రాత్రులను చూపెడుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: