తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ అనసూయ, రష్మి ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు గ్లామర్ సొగబులు అదుతున్నారు. ఇపుడు వీరి దారిలో ప్రాయాణిస్తూ తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ వర్షిణి. గ్లామర్ ఫీల్డ్‌లో సినిమా హీరోయిన్స్‌తో పాటు టీవీ యాంకర్‌లకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే. ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. 

 

బ్యూటీ తొలుత హైదరాబాద్‌లో మోడలింగ్ చేసింది. అందంతో పాటు నటించే టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల వైపు అడుగులు వేసింది. ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్’తో పాటు పలు చిత్రాల్లో శామిలి సౌందరాజన్ పేరుతో నటించారు. శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయి ఈ బ్యూటీ.. అక్కడ సరైన అవకాశాలు లేక పోవడంతో బుల్లితెర వైపు టర్న్ అయింది. ఆ తర్వాత‌ వర్షిణిగా పేరు మార్చుకుని ‘ఢీ 10’ కో యాంకర్‌గా ఢీకొట్టింది. అలాగే అనేక షోలు చేసుకుంటూ బిల్లితెర‌పై పాపుల‌ర్ అయింది. ఇక ప‌టాస్ షోలో శ్రీముఖి ప్లేస్‌ను రీ ప్లేస్ చేసింది వ‌ర్షిణి.  కో యాంకర్ రవితో కలిసి బుల్లితెరకు హాట్ సొగసులు అద్దుతోంది. 

 

కానీ ఈ షోలో యాంక‌ర్ ర‌వి కూడా వెళ్లిపోవ‌డంతో.. అత‌గి ప్లేస్‌ను  చలాకీ చంటి రీ ప్లేస్ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నయాంకర్ వ‌ర్షిణి.. ప‌టాస్ షో జరుగుతున్న సమయంలోనే అభిమానిని స్టేజీపైకి పిలిచి బుగ్గ కొరికింది. సాధారణంగా ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ స్టేజ్‌పైకి పిలిచి అత‌డి బుగ్గ కొరికేసింది. దాంతో అక్కడున్న వాళ్లే కాకుండా.. చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. అయితే ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ‌ వైరల్ అవుతుంది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: