టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లో వచ్చే మూవీస్ బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి కాంబినేషన్ గా చెప్పొచ్చు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త సినిమా ప్రారంభమైంది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్రేజీ కాంబినేషన్ మరోసారి కుదిరింది. ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ కాంబో మొదలయ్యింది. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ‘నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగుతో మూవీని లాంఛనంగా ప్రారంభించారు.
కాగా, బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ నిచ్చారు. నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక సింహ, లెజెండ్ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి మంచి కాంబినేషన్ ని తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ముద్ర పడిపోయింది. ఈ రెండు సినిమాలు భారీ హిట్టు కావడంతో ఇప్పుడు ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం బాలకృష్ణ కే. యస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాని చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ఈ సినిమా క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సనసన ‘జెర్సీ’ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. అలాగే సంజయ్ దత్ను విలన్గా తీసుకున్నారని ఇండస్ట్రీల వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, రోజాను కూడా పవర్ఫుల్ రోల్ కోసం సంప్రదించారని టాక్.