బుల్లితెర సెలెబ్రెటీ సుడిగాలి సుధీర్ హీరోగా మారుతున్నాడు. ఇప్పటి వరకు ‘జబర్దస్త్’ నుండి హీరోలుగా మారిన వారు ఎవరు సక్సస్ కాలేకపోయినా తన అదృష్టాన్ని మాత్రం పరీక్షించుకుంటున్నాడు సుడిగాలి సుధీర్. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్'  అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీని శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకం పై పారిశ్రామికవేత్త కే. శేఖర్‌ రాజు నిర్మిస్తున్నాడు. 

సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ కమెడియన్ ఆలీ నిర్వహిస్తున్న ‘ఆలీ తో సరదాగా’ షోకు అతిధిగా రాబోతున్న సుడిగాలి సుధీర్ కార్యక్రమ ప్రచారానికి సంబంధించి కట్ చేసిన ప్రోమోలో సుధీర్ తన అంతు పట్టని అనారోగ్యం గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్న సీన్ ను హైలేట్ చేస్తూ ఆ కార్యక్రమ ప్రోమోను కట్ చేయడంతో రాబోయే సోమవారం ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమం పై చాల అంచనాలు పెరుగుతున్నాయి. 

ఈ ప్రోమో లో సుధీర్ తన అనారోగ్య సమస్య గురించి మాట్లాడుతూ ‘నాకెందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ నొప్పులకు ఎందుకు బతికున్నానా అనిపించింది. కదిలితే షాక్ కొట్టినట్లు అయ్యేది. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆపరేషన్ చేయాలి. తేడా వస్తే కాళ్లు పని చేయవు అని చెప్పారు' అని చెపుతూ సుధీర్ ఎమోషనల్ అయిన సీన్ ను చూసిన వారు సుధీర్ కు ఏమైంది అంటూ టెన్షన్ పడిపోతున్నారు. ఇదే సందర్భంలో సుదీర్ రేష్మి గురించి మాట్లాడుతూ తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారాలూ లేవు అని చెప్పినా పట్టించుకునే స్థితిలో జనం లేకపోవడంతో తమ ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి నిజంగానే తమ మధ్య ప్రేమ ఉన్నట్లు నటించ వలసి వస్తోంది అంటూ సుధీర్ తన జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ ఇంటర్వ్యూలో ప్రసారం కాబోతున్నాయి. దీనితో ఈ ఇంటర్వ్యూ కార్యక్రమం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: