తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టిన హీరోల్లో మహేశ్ బాబు కూడా ఉన్నాడు. ప్రిన్స్ మహేశ్ గా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. అందుకే మహేశ్ తో సినిమా చేయాలని నిర్మాతలు క్యూలు కడుతున్నారు. సినిమా తర్వాత సినిమా పక్కాగా ప్లాన్ చేసుకోవడంలో మహెశ్ పర్ఫెక్షనిస్ట్. ఏ సినిమా చేసినా కథను బట్టి గ్రాండియర్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అందుకుతగ్గట్టే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా మహేశ్ తో సినిమాలు తీస్తూంటారు.

 

 

మహేశ్ సినిమాల్లో భారీ సెట్టింగ్స్ మొదలైంది ఒక్కడు సినిమాతో. ఆ సినిమాలో వేసిన చార్మినార్ సెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దర్శకుడు గుణశేఖర్ ఆలోచనలకు నిర్మాత ఎంఎస్ రాజు ఖర్చుకు వెనకాడకుండా ఆ సెట్ వేశాడు. తర్వాత మళ్లీ గుణశేఖర్ దర్శకత్వంలోనే మహేశ్ చేసిన అర్జున్ మూవీలో మధురై meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి అమ్మ ఆలయం సెట్ గురించి దక్షిణ భారత సినీ పరిశ్రమే మాట్లాడుకుంది. అచ్చం మధురైలోని ఆలయాన్నే హైదరాబాద్ లో పునఃప్రతిష్ట చేసారనే చెప్పుకోవాలి. సినిమా విడుదలయ్యాక కూడా కొన్నేళ్ల పాటు ఆ ఆలయాన్ని టూరిస్ట్ వెంచర్ గా ఉంచారు. భరత్ అను నేను సినిమాకు కూడా ఏకంగా అసెంబ్లీనే నిర్మించేశారు. నిజమైన అసెంబ్లీలో సమావేశులు చూసినట్టే ఫీల్ అయ్యారు ప్రేక్షకులు.

 

 

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో కర్నూలులోని ప్రతిష్టాత్మక కొండారెడ్డి బురుజునే నిర్మించారు. కధానుసారం ఈ సెట్ వేశారట మేకర్స్. ఆర్ట్ డైరక్టర్ ప్రకాశ్ కొండారెడ్డి బురుజునే తీసుకొచ్చి అక్కడ పెట్టినంత సహజంగా నిర్మించాడట. చూస్తుంటే మహేశ్ కు భారీ సెట్టింగ్స్ ఆనవాయితా మారినట్టుంది. సెంటిమెంట్ గా మారిన ఈ భారీ సెట్టింగ్స్ మహేశ్ కు ఏమేర కలిసొస్తాయో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: