మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ విజయాలు లేక చతికిల పడుతున్నాడు. అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. శ్రిరస్తు శుభమస్తు సినిమా కొంచెం ఫర్వాలేదనిపించినా ఆ క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కింది. విజయం కోసం ప్రయత్నం చేస్తున్న కూడా అది అతని చేరట్లేదు. ఈ సంవత్సరం ఏబీసీడీ అనే రీమేక్ సినిమా చేసినా ఫలితం లేకుండా పోయింది.

 

సినిమా రీమేక్ అయినప్పటికీ అతనికి విజయం అందించలేకపోయింది. దాంతో శిరీష్ కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడట. అందుకే ఏబీసీడీ సినిమా వచ్చి చాలా రోజులు అయినా ఇంతవరకు తర్వాతి సినిమాని ఓకే చేయలేదు. మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా అల్లు శిరీష్ తదుపరి చిత్రం ఆ దర్శకుడితో.. ఈ దర్శకుడితో అంటూ వార్తలు వచ్చాయి. కాని అఫిషియల్ గా అయితే ప్రకటన రాలేదు. 

 

తాజాగా మరోసారి అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెగా అల్లుడైన కళ్యాన్ దేవ్ తో విజేత సినిమా తీసిన దర్శకుడు రాకేష్ శశి అల్లు శిరీష్ కి ఒక కథ వినిపించాడట. అది శిరీష్ కు నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో రాకేష్ శశి ఉన్నాడట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత మెగా కాంపౌండ్ మరోసారి స్క్రిప్ట్ ను పరిశీలించిన తర్వాత అప్పుడు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందట

 

 అయితే ఇన్నాళ్లు వెయిట్ చేసిన అల్లు శిరీష్ మరికొంత కాలం వెయిట్ చేసి కొత్త దర్శకులతో సినిమా చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. మళ్లీ ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడం కొందరు మెగా అభిమానులకి అంతగా నచ్చట్లేదు. చూద్దాం మరి ఈ సినిమా ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: