బాలకృష్ణ, బోయపాటి సినిమా వస్తుంది అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. యాక్షన్ తో పాటు సెంటిమెంటల్ సీన్స్ కూడా సమానంగా ఉంటాయి అయన సినిమాలో.. అయితే వీరి సినిమాలో తాజాగా సంచలనం సృష్టించిన దిశ హత్య గురించి కూడా ఒక సీన్ ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ హత్య గురించి తప్ప ఇంకేమి వినిపించడం లేదు.
ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు దీనిపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఏదో ఓ సినిమాలో దిశ ఎపిసోడ్ మొత్తాన్ని ఇతివృత్తంగా వాడుకోవాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇది బాలయ్య సినిమాలో కనిపించబోతుందని ప్రచారం కూడా మొదలైంది. బోయపాటితో ఈయన త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. దీని ఓపెనింగ్ కూడా జరిగిందిప్పుడు. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
ఈ సినిమాలో దిశ హత్య గురించి పెట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి. దిశ హత్యపై చిత్ర ఓపెనింగ్లో చాలా సీరియస్గా స్పందించాడు బాలయ్య. దాంతో ఈ చిత్రంలో బోయపాటి కూడా ఇలాంటి ఓ ఎపిసోడ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. సింహా సినిమా సమయంలో యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన ఎపిసోడ్ పెట్టాడు బోయపాటి శ్రీను. ఇక లెజెండ్లో అమ్మాయిలను పురిటిలోనే చంపే వారికి బుద్ధి చెప్పే సీన్ కూడా పెట్టాడు.
ఇప్పుడు కూడా దిశ ఎపిసోడ్ ఒకటి ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదెంత వరకు నిజమనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఒక్క ఫ్లాపుతోనే బోయపాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ కావడంతో ప్రజలు ఇంకా బాగా కనెక్ట్ అవుతారని వీరు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.