స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  అల .. వైకుంఠపురములో..  షూటింగ్ తుది దశకు చేరుకుంది.  డిసెంబర్  మూడో వారం కల్లా  షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇప్పటికే  ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి  సినిమా పై అంచనాలను  పెంచేలా చేసింది చిత్ర యూనిట్. అందులో  భాగంగా  ఇప్పటివరకు  ఈ చిత్రం నుండి మూడు సాంగ్స్  విడుదలకాగా  మొదటి రెండు సాంగ్స్  అద్భుతమైన రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. 
 
 
మొదటి సాంగ్   'సామజవరగమన'  100మిలియన్ల వ్యూస్ తో  సాంగ్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది.  అంతేకాదు ఈసాంగ్  ఇప్పటివరకు  అత్యధిక లైక్స్ ను రాబట్టుకున్న సౌత్ సాంగ్ గా  రికార్డు  క్రియేట్   చేసింది.  అలాగే రెండో సాంగ్  రాములో రాములా.. కూడా  సూపర్ రెస్సాన్స్  ను రాబట్టి  తెలుగులో అత్యధిక లైకులను రాబట్టిన  రెండవ సాంగ్ గా రికార్డు సృష్టించింది. ఈ రెండు సాంగ్స్ తో  సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఇప్పుడు బన్ని ఫ్యాన్స్ ఫోకస్ అంతా టీజర్ పై పడింది. టీజర్ కోసం  అయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు  ఈటీజర్ విడుదలతేది ని ప్రకటించనున్నారని  వార్తలు వస్తున్నాయి. ఏ క్షణమైనా  ఈ టీజర్ అప్డేట్  వెలుబడనుందట.  
 
 
 
 పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా  పూజాహెగ్డే నటిస్తుంది.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో   టబు , జయరాం ,మురళీ శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత  పేతురాజ్   ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.   గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్,రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 న ఈచిత్రం విడుదలకానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: