ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల..వైకుంఠపురంలో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నికి సంబంధించిన లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత త్రివిక్రమ్ చాలా గ్యాప్ తీసుకొని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘అలా వైకుంఠపురములో’ సినిమా తీస్తున్నారు. ఇక నాపేరు సూర్య మూవీ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురములో’ ఎంతో కసిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. గత నెల రోజుల నుంచి యూట్యూబ్ లో ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా ఈ సాంగ్స్. ఎక్కడ విన్నా 'సామజవరగమన', 'రాములో రాములా' సాంగ్స్ వినిపిస్తు..అంచనాలు దాటిపోయాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది సూపర్ హిట్స్ సాంగ్స్ ఏవంటే 'సామజవరగమన', 'రాములో రాములా' అనే చెబుతున్నారు. దాంతో ఈ మూవీపై ఒక్కసారే భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఒక దశలో వీటికి పోటీగా పాటలు విడుదల చేయడానికి మిగిలిన సినిమాలు వెనుకడుగు వేస్తున్నాయంటే ఈ పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. 'అల వైకుంఠపురములో' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రమోషన్ చేయడం ఆరంభించారు చిత్ర యూనిట్. అల్లు అర్జున్ - పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో సంచలనం సృష్టిస్తుంది.
ఇది ఎంతవరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. అలా వైకుంఠపురములో అప్పుడే సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు. 'నెట్ ఫ్లిక్స్'వారు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన లావాదేవీలు ఆల్రెడీ పూర్తయ్యాయని అంటున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే స్టార్ డమ్ తో పాటు ఆమె పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆమె డేట్స్ దొరకడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో అలనాటి అందాల తార టబూ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.