కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహమయ్యి 7 ఏళ్ల దాటింది. అయిన ఇప్పటికీ వారిద్దరిని... బాలీవుడ్ జంటలలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా చెప్పుకుంటారు. వారిద్దరికీ పుట్టిన తైమూర్ అలీఖాన్ కూడా పెద్ద సెలెబ్రెటీనే. అయితే పెళ్ళి అయ్యిన రోజు నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. దానికి గల కారణాలను, వారి పెళ్ళికాకముందు వారిమధ్య ఉన్న కొన్ని రహస్యాలను కరీనా కపూర్ ఒక ఈవెంట్ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. ఆ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు.

ఆమె మాట్లాడుతూ.. 'సైఫ్ అలీఖాన్, నేను ఇద్దరం కలిసి తలాష్ మూవీ లో నటించాం. అప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది' అని చెప్పింది. అయితే కరీనా పక్కనే కూర్చున్న అక్షయ్ కుమార్ మధ్యలో జోక్యం చేసుకొని... అవును! మొత్తం అప్పుడే ప్రారంభమయింది అని అన్నాడు..

దాంతో.. కరీనా మాట్లాడుతూ.. 'అవును... మేము లవ్ చేసుకుంటున్నామని మొట్టమొదటిగా అక్షయ్ కు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఆ రహస్యం ఇతరులకు తెలియకుండా దాచి పెట్టి మంచి పని చేశాడు. అక్షయ్ నాకు మంచి ఫ్రెండ్' అని చెప్పింది.

అయితే అక్షయ్ మాట్లాడుతూ... 'వీరి విషయం ఎలా తెలిసిందంటే నా రూమ్.. సైఫ్ అలీ రూమ్ పక్కనే ఉంది' అంటూ...నవ్వుకుంటూ చెప్పాడు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ చేసే ఆమె... కరీనా కపూర్ ను... మీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? అని ప్రశ్నించింది..

దీంతో కరీనా కపూర్ మాట్లాడుతూ... ' నేను లవ్ చేయడం అనేది పెద్ద నేరమేమీ కాదు. లవ్ చేస్తున్నానని, మ్యారేజ్ చేసుకున్నానని... నాతో పని చేయడానికి ఎవరు ఇష్టపడకపోతే... మానుకోండి. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక నేరం లాగా భావించడం లేదు. కానీ నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా.. ప్రతి ఒక్కరూ నా కెరీర్ అయిపోయిందని చెప్పారు. నేను అప్పుడు.. ఇదేం విడ్డూరం అనుకున్నాను. కానీ ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకోవడమే నాకు కావాలనుకున్నా. అదే చేశా కూడా. నా జీవితంలో అదే ఒక గొప్ప నిర్ణయం అని భావిస్తున్నాను." అని చెప్పింది.





మరింత సమాచారం తెలుసుకోండి: