సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు నెల రోజులే ఉండడంతో ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. అలాగే రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. అలాగే.. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, అజయ్, బండ్ల గణేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ గురించి కొన్ని వివరాలు తాజగా బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడికి రూ.8 కోట్లు పారితోషికం ముట్టిందట.  మహేష్ బాబు ఇతర నటీనటుల రెమ్యూనరేషన్లన్నీ కలిపితే రూ.60 కోట్లు అయిందట.  సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ రూ. 32 కోట్లు.  మొత్తం కలిపి ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల మార్క్ టచ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవ‌ల విడుద‌ల అయిన టీజర్‌, ఫ‌స్ట్ సాంగ్ సినిమాపై అటు ప్రేక్షకుల‌లో, ఇటు మ‌హేష్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా,  ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేస్తున్న విష‌యం తెలిసిందే.

 

ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలో మేజర్ ఎపిసోడ్ ఒకటి ట్రైన్ లో సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ..ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ట్రెయిన్ లోనే సాగుతుందట. సీమలో మహేష్ అడుగుపెట్టడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుంద‌ని.. ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. అదే విధంగా.. ఈ సినిమా రవితేజ ‘నిప్పు’ లాగా ఉండబోతోందని కూడా టాక్ వినిపిస్తోంది. కాగా, దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏదేమైనా క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: