గత కొన్ని రోజులుగా ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఓ షోపై చర్చలు నడుస్తున్నాయి. ఆ షో పేరేమిటో తెలుసుకోవాలని వుందా ?ప్రజలను కడుపుబ్బా నవ్వించి టి ఆర్ పిలో నెంబర్ వన్ షోగా నిలిచిన జబర్దస్త్ షో .ఈ షోకి నాగబాబు ,రోజా జర్డ్జ్ గా నిర్వహించేవారు .కాగా ఉన్నట్లుండి ఇటీవల నాగబాబు తప్పుకోవడం.. అంతేకాకుండా ఆయనతో పాటే ఆర్పీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు బయటికి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా షో కళ తప్పింది. మొత్తనికి ఏదో వెలితి అయితే కచ్చితంగా కనిపిస్తుంది. తన దారి తాను చూసుకున్నాడు నాగబాబు కానీ కొందరు కమెడియన్లను మాత్రం తీసుకెళ్లాలని ఆయన విఫలయత్నం చేసాడు. కానీ వాళ్లు మాత్రం అక్కడికి రాలేదు. ఇక్కడే ఉన్నారు. నాగబాబుకు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు శిష్యులు కమ్ భక్తులు కూడా. ఆయనేం చెబితే అదే వీళ్లకు వేదం.
నిజానికి జబర్దస్త్ వదిలేసినా నాగబాబుకు పోయేదేం లేదు.. అంతకంటే ఎక్కువ పారితోషికం జీ తెలుగులో వస్తుంది. ఒకవేళ అక్కడ ఆ షో ఫ్లాప్ అయినా కూడా ఆయన కెరీర్కు ఏం భయం లేదు.. కావాలంటే మళ్లీ జబర్దస్త్కు వచ్చే సత్తా నాగబాబుకు ఉంది. అంతేకాదు అదే రెమ్యునరేషన్ తీసుకునే స్టామినా కూడా ఆయనకు ఉంది.
కానీ నిజానికి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది జబర్దస్త్ కమెడియన్ల పరిస్థితి ఏమవుతుందా అని వాళ్లకు జబర్దస్త్ మాత్రమే జీవితం. దీన్ని నమ్ముకునే వున్నవాళ్లు చాలా మంది వున్నారు . అందుకే రిస్క్ తీసుకోడానికి వణికిపోతున్నారు. గతంలో సినిమా ఛాన్సులు పెరిగాయని బయటికి వెళ్లిన రఘు, వేణు, షకలక శంకర్, ధనాధన్ ధన్రాజ్, రచ్చ రవి లాంటి వాళ్లు కనీసం ఇప్పుడు ఒక్క సీన్లో కూడా కనిపించడం లేదు.
వీరు మాత్రం అటు సినిమాలు లేక.. ఇటు జబర్దస్త్ షోలోకి రీ ఎంట్రీ ఇవ్వలేక మధ్యలోనే నలిగిపోతున్నారు. వాళ్లను చూసిన తర్వాత.. అన్ని కష్టాలు దగ్గరుండి అనుభవించిన తర్వాత కూడా ఈ కమెడియన్లు ఇప్పుడు రిస్క్ చేస్తారనుకోవడం నిజంగా హాస్యాస్పదమే. అందుకే నాగబాబు వెళ్లినా కూడా మొండిగా సుధీర్, ఆది లాంటి వాళ్లు ఎటువెళ్లలేక ఇక్కడే ఉండి జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. వాళ్లు వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నా కూడా వెళ్లకుండా ఉండాలనే వాళ్ల మనసుల్లో కూడా కోరిక బలంగా ఉంది. అందుకే లైఫ్ ఇచ్చిన షోను వదిలివెళ్లే సమస్యే లేదంటున్నారు వాళ్లు. ఇప్పటికే ఈ విషయంలో హైపర్ ఆది, సుధీర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయనతో పాటు మిగిలిన వాళ్లు కూడా ఎవరూ జబర్దస్త్ షోను వదిలేది లేదంటున్నారు. మరి చూడాలిక.. నాగబాబు ఒంటరిగా అక్కడేం చేస్తాడో..?