తెలుగు బుల్లితెరపై పటాస్ ప్రోగ్రామ్ తో బాగా పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి.  రాములమ్మ రచ్చ రచ్చ అంటూ పటాస్ లో యాంకర్ రవితో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఓ వైపు బుల్లితెరపై నటిస్తూనే.. కొన్ని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది శ్రీముఖి.  కానీ సినిమాలు మాత్ర పెద్దగా కలిసి రాలేదు.  ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 లో తనదైన కాంట్రవర్సీ, అల్లరి, వెరైటీ పర్ఫామెన్స్ తో బాగా అలరించింది శ్రీముఖి.  చివరి వరకు శ్రీముఖి విన్నర్ అనే ఛందంగా గట్టి పోటీ ఇచ్చింది..కానీ రన్నరప్ గా సరిపెట్టుకుంది.  అయితే బిగ్ బాస్ లో అందరితో చనవుగా ఉన్న శ్రీముఖి ఒక్క సింగర్ రాహూల్ సిప్లిగంజ్ తో మాత్రం వైరం పెట్టుకుంది.  

 

మొదటి నుంచి వీరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శలు, తిట్టుకోవడాలు.. ఇది ఎంత వరకు సాగిందంటే.. బిగ్ బాస్ 3 హూస్ట్ గా వ్యవహరించిన నాగార్జన సైతం సర్థి చెప్పేవరకు వెళ్లింది. విచిత్రం ఏంటంటే వీరిద్దరే చివరి వరకు ఉండి విన్నర్ గా రాహూల్ రన్నరప్ గా శ్రీముఖి గెలిచారు. ఇక బయటకి వచ్చాక ఎవరిదారిలో వారు బిజీ అవుతూ వచ్చారు. మొదటి నుంచి బిగ్ బాస్ లో టామ్ అండ్ జర్రీలా ఉంటూ వచ్చిన రాహూల్ - శ్రీముఖి ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు.  

 

తాజాగా  ఓ పార్టీలో కలిసి సందడి చేశారు. దీనికి సంబందించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా రాహుల్ తో ఉన్న ఫోటోను శ్రీముఖి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి `గతం గత:! అసలు రిలేషన్షిప్‌ ఇప్పుడు మొదలైంది!' అంటూ పోస్ట్ పెట్టింది.  అయితే దీనికి రాహుల్ ఎంత వరకు సమ్మతిస్తాడో తెలియదు కానీ మొత్తానికి టామ్ అండ్ జెర్రీలా ఉన్న వీరు మోటూ పతులూ గా మారడం మాత్రం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు నెటిజన్లు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️

A post shared by Sreemukhi (@sreemukhi) on

మరింత సమాచారం తెలుసుకోండి: