యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి సినిమా ఇచ్చిన విజయంతో అంతర్జాతీయంగా పాపులర్ అయిన ప్రభాస్ నెక్స్ట్ ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్టు విషయంలో ఎక్కడా కూడా తన మార్కెట్ కి తగ్గకుండా తన ఆలోచనలు ఉండేటట్లు సినిమాలు ఒకే చేయడంలో పక్కా పకడ్బందీగా ఎక్కడా కూడా తగ్గకుండా వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే బాహుబలి తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని బాహుబలి కంటే భారీ ప్రాజెక్ట్ స్టోరీ కలిగిన ‘సాహో’ సినిమా ప్రభాస్ చేయడం జరిగింది.

 

అయితే తీరా సినిమా విడుదలయ్యాక భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సాహో’ సినిమా విడుదలైన అన్ని చోట్ల బొక్క బోర్లా పడింది. రెండు సంవత్సరాలు పాటు సినిమా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మొట్ట మొదటి షోకే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా విషయాలలో భారీ ప్రాజెక్ట్ కలిగిన సినిమాలు చేయకూడదని ముఖ్యంగా హై బడ్జెట్ తో కూడిన సినిమాలు జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు 'సాహో' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వార్తలు రావడం జరిగాయి. తీరా 'సాహో' సినిమా తర్వాత ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో మళ్లీ ప్రభాస్ బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమా భారీ రేంజ్ లోనే ఉండాలని సినిమా నిర్మాతలకు ప్రభాస్ సూచించినట్లు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేయబోతున్న సినిమా బడ్జెట్ 150 కోట్లు అని అనుకున్న తరుణంలో తాజాగా బడ్జెట్ మొత్తం కలిపి 180 కోట్ల బడ్జెట్ మేరకు సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 'సాహో' లాంటి భారీ ఫ్లాప్ పడినా గాని బడ్జెట్ విషయంలో ప్రభాస్ తగ్గటం లేదు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి రాధాకృష్ణ సినిమాతో అయినా ప్రభాస్ హిట్ కొడతాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: