ఇండస్ట్రీలో తమన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.  ఒక మోస్తారు బడ్జెట్ సినిమాల దగ్గర నుండి  భారీ బడ్జెట్ సినిమాల వరకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా దర్శకులు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలివుడ్ లో తమన్ క్రేజ్ మామూలుగా లెదు. ఇప్పుడు తమన్ చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. వచ్చే వారం విడుదల కాబోయే 'వెంకీ మామ'కి మ్యూజిక్ అందించింది తమనే.. ఆ తరువాతి వారం క్రిస్మస్ కానుకగా బోతున్న 'ప్రతిరోజూ పండగే' కూడా తమన్ సినిమానే. 

 

అలాగె సంక్రాంతికి రాబోయే 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో కూడా  తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే అల వైకుంఠపురలం పాటలు మ్యూసిజ్ లవర్స్ ని మ్యాజిక్ చేస్తున్నాయి. అంతేకాదు రవితేజ 'డిస్కో రాజా'కి కూడా తమన్ మ్యూజిక్ అందించారు. రవితేజ తర్వాతి సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందిచనున్నట్లు సమాచారం.

 

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా డిసైడ్ చేసుకున్నారు. బోయపాటి తన ప్రతీ సినిమాకు దేవీశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటాడు. కాని సరైనోడు సినిమాకి మాత్రం తమన్ సంగీతాన్ని అందించాడు. బోయపాటి దర్శకత్వం లో తమన్ చేస్తుంది ఇది రెండవ సినిమా.

 

మరోవైపు మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్ అని అనుకుంటున్నారట కాని.. ఇంకా క్లారిటీ రాలేదు . నిజానికి ఈ ప్రాజెక్ట్ కూడా దేవి చేయాల్సింది కానీ తమన్ కి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే తమన్ చేతుల్లో చాలా ప్రాజెక్ర్ట్స్ ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. తమన్ తన మెస్మరైజింగ్ మ్యూజిక్ తో ఫ్యాన్స్ ని మైమరపిస్తున్నాడు.  అందుకేనేమో దర్శకులు తమన్ సంగీతం కోసం క్యూ కడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: