దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్. ఇలాగే నాతో పాటు మరికొందరు మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నేతలను శిక్షిస్తారని భావిస్తున్నాను.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు..' అంటూ.. పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. గత కొంత కాలంగా పూనం కౌర్ మోసపోయానని నన్ను దారుణంగా మోసం చేశారని సోషల్ మీడియా లో నానా హంగామా చేస్తున్నారు పూనం. అది జనసేనాని పవన్ కళ్యాణ్ మీదే అని కూడా చాలామందికి తెలిసిన సంగతే. పవన్ కి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళే నన్ను ఆయనకు కాకుండా చేశారన్న మాట కూడా గతంలో పూనం అన్నట్టు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఏ చిన్న ఛాన్స్ దొరికినా పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్ గానే అటాక్ చేస్తోంది. అలా ఇప్పుడు మరో సారి పవన్ మి ఉద్దేశించి పూనం చేసిన ట్వీట్స్ సంచలనం అవుతున్నాయి. 

 

ఇలా ట్వీట్ చేసిన తర్వాత కొద్ది సేపటికి పూనం ట్వీట్ ను తొలగించినట్టుగా తెలుస్తోంది. తొలగించడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో కానీ.. ఆమె ట్వీట్లో పవన్ కల్యాణ్ ని 
ఇన్ డైరెక్ట్ గా అన్న ప్రస్తావన స్పష్టం అవుతూ ఉంది. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు వేయాలని ఇటీవలే పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అది పవన్ కల్యాణ్ ప్రస్తావన. ఈ ట్వీట్లో మరో ప్రస్తావన కూడా ఉంది. 'రెండు బెత్తం దెబ్బలు ప్లీజ్..' అంటూ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై ఒక హీరోయిన్ సెటైర్ వేసింది. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు చాలు.. అంటూ జనసేన అధినేత చేసిన తీర్మానాన్ని ఆమె వెటకారంగా మాట్లాడించి. దిశ రేపిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని స్వాగతిస్తూ పూనమ్ కౌర్ ఆ ట్వీట్ చేసింది.

 

సినీ అలియాస్ రాజకీయ నేత అంటూ పూనమ్ ప్రస్తావించింది. తనతో పాటు మరికొందరు మహిళలను ఆ వ్యక్తి మోసం చేశారని పూనమ్ పేర్కొంది. అతడి మీదా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇన్‌డైరెక్ట్ గా చేసిన ఈ ట్వీట్ ఎవరికి తగులుతోందో స్పష్టంగానే ఉంది. మరి దీనిపై అవతలి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.   ఇక ఇదే అంశం మీద సీనియర్ నటుడు సుమన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాదు కొంతమంది నెటిజన్లు పవన్ ని 'రెండు బెత్తం దెబ్బలు' ఏంటని కామెంట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: