అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో బిజినెస్ మేన్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా పాపులరయ్యారు. గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్సినిమా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా రకరకాల కారణాలతో అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. నిర్మాతకు నష్టాలు తప్పలేదు. చిత్ర బృందానికి ప్రేక్షకుల నుంచి ఊహించని షాక్ తగిలింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం కూడా సినిమాని ఆదుకోలేక పోయింది. ఆ తర్వాత కూడా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ తో జయ జానకి నాయక సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫలితం తెలిసిందే. సినిమా బావుందని అన్నా, హిట్ టాక్ వచ్చినా కానీ కమర్షియల్ గా మాత్రం నిర్మాతకు వర్కౌట్ అవలేదు.

 

అయితే ఎంత బిజినెస్ మేన్ అయినా వరుస ఫ్లాపులు వచ్చాక సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ కానే కాదు. ఇండస్ట్రీలో నెగెటివ్ శక్తులు..ఈ నిర్మాత పనైపోయిందనే ప్రచారం సాగించాయి. కానీ ఇంతలోనే ఊహించని విధంగా ఆయన నటసింహా నందమూరి బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో భారీ బడ్జెట్ సినిమాని ప్రారంభించారు. రెండు ఫ్లాప్ సినిమాలు నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి ఇప్పుడు అగ్ర హీరోతో పని చేస్తుండడం సినీ పరిశ్రమలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.

 

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఎన్బీకే 106 మూవీకి దాదాపు 40-50 కోట్ల వరకు బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాతగా కంబ్యాక్ అయ్యేందుకు మిరియాల రవీందర్ రెడ్డి చాలానే రిస్క్ చేయబోతున్నారట. బాలయ్య కోసం మిరియాల ఏడాది కాలంగా వెయిటింగ్ లో ఉన్నాడు. ఎట్టకేలకు సస్పెన్స్ కి తెర దించుతు మిరియాల సహనం ఫలించి ఇప్పటికి సినిమా ప్రారంభమైంది. మొత్తానికి అనుకున్నట్టుగా బాలయ్య ను స్క్రిప్టు తో ఒప్పించి బోయపాటి అన్నిరకాల సస్పెన్స్ కి తెర దించారు. ఈ శుక్రవారం(డిసెంబర్ 6) సినిమా మొదలైంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారు. సమాజంలోని పలు బర్నింగ్ అంశాల చుట్టూ ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ గా కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: