రష్మిక మంధాన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఈ చిత్రంలో రష్మిక మందన చిలిపి చేష్టలకు యువత ఫిదా అయ్యారు. ఇక తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’తో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం, రష్మిక అద్భుత నటనతో ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె వైపే చూస్తున్నారు. దీంతో తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో ఆమె బోలెడన్ని అవకాశాలను దక్కించుకుంటుంది. అయితే గీత గోవిందం సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమా చేసింది. ఐతే.. ఈ సినిమా ఒకింత నిరాశ కలిగించింనప్పటికీ ఆ భామకు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి బంపర్ అఫర్ వచ్చింది. కానీ రష్మిక ఆ ఆఫర్ కు నో చెప్పేసింది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన జెర్సీ మూవీని రీ మేక్లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అయితే హీరోయిన్ పాత్రలో నటించమని మృనాల్ ఠాకూర్ను అడగడంతో రెమ్యూనరేషన్ భారీగా చెప్పిందంట. దీంతో ఆమె స్థానంలో రష్మికను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయలేనని వేరేవాళ్లని చూసుకొమ్మని చెప్పేసిందీ రష్మికా. నేనేదైనా సినిమాలో భాగమైతే దానికి పూర్తి న్యాయం చేయాలనుకుంటాను.
అలా నమ్మకం లేకపోతే ఆ సినిమాను నేను ఒప్పుకోను. జెర్సీ లాంటి మూవీ రీమేక్ పెద్ద విషయం. ఆ పాత్రకు నేను సరిపోనని ఆమె స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం రష్మికా.. సూపర్స్టార్ మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్ర చేస్తోంది. తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.