తొలిసారిగా విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కలిసి నటిస్తున్న తాజా సినిమా వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లయిన వీరిద్దరూ ఈ సినిమాలో కూడా అదే పాత్రల్లో నటించడం విశేషం. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు మరియు టీజర్ ప్రేక్షకుల్లో సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేయడంతో పాటు ఎప్పుడెప్పుడు సినిమాని చూస్తామా అని ఉత్సాహాన్ని క్రియేట్ చేసాయి. ఇక నేడు ఖమ్మంలో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

 

ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ సాదిస్తుందని అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ట్రైలర్ లో వెంకటేష్ మరియు నాగ చైతన్య పలికిన డైలాగులు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. మంచి యాక్షన్, ఎమోషననల్, వినోదాత్మక సన్నివేశాలతో సాగిన ఈ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఛేజింగ్ సీన్స్, ఫైట్స్ ఎంతో అదిరిపోయాయి. 'వాడిని చూసి మూడేళ్లు అయింది సర్', 'ఈ జాతరని రంగులతో కాదు మీ రక్తంతో నింపుతా' అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ తో పాటు, 

 

'నీ నుండి నువ్వు కూడా నన్ను దూరం చేయలేవు మామ' అంటూ నాగ చైతన్య పలికిన డైలాగ్ హృదయాలను తాకుతాయి. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు, టిజి విశ్వప్రసాద్ తమ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్తలపై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, హీరోయిన్స్ గా రాశి ఖన్నా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర హిట్ కొడుతుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: