సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ మైండ్ బ్లాక్'  కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత `సరిలేరు నీకెవ్వరు` చిత్రం నుండి సెకండ్ సింగిల్ సూర్యుడివో చంద్రుడివో... సోల్ ఫుల్ మెలోడీ ని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదలచేయనుంది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి11నప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

 

గతంలో దేవీ పాటలతో పోలిస్తే కాస్త కొత్తగా ఉంది ఈ పాట. మైండ్ బ్లాక్.. బాబూ నీ మాస్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్.. నువ్వు స్టెప్పేస్తే మైండ్ బ్లాక్ అంటూ అనిల్ రావిపూడి కూడా పక్కా మాస్ పాట రాయించుకున్నాడు. రేపు వీడియో విడుదలైన తర్వాత పక్కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక‌పోతే గతేడాది భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌ను పిలిచిన మహేష్.. ఈ సారి చరణ్ వైపు చూస్తున్నాడు. దాంతో పాటు రాజకీయ నాయకులు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. 

 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: