నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలకు జతగా నటించే హీరోయిన్స్ ని వెతకడం ఇప్పుడు దర్శక, నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఈ పరిస్థితి ఎక్కువగా దర్శక, నిర్మాతలకు ఎదురవుతోంది. ముఖ్యంగా కొన్ని కథలకు మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్, కమల్ హాసన్..వంటి సీనియర్ స్టార్ హీరోలైతే  హీరోయిన్స్ ని సెలక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ విషయంలో హీరోయిన్స్ కూడా కాస్త ఆలోచిస్తున్నారు. సీనియర్లతో నటిస్తే యంగ్ హీరోలు అవకాశాలివ్వడం లేదు. అందుకే మన హీరోయిన్లు ఎవరూ వెటరన్ హీరోలకు ఓకే చెప్పడం లేదన్న టాక్ ఉంది. సీనియర్ల సరసన నటిస్తే ఆ ప్రభావం కెరీర్ ని వెంటాడుతుందని యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఆలోచిస్తున్నారట. అందుకే సీనియర్ హీరోల సరసన నటించే హీరోయిన్స్ కోసం దర్శక, నిర్మాతలు చాలా సెర్చ్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ కోసం బోయపాటి సెర్చింగ్ లో ఉన్నారట. మహానటి ఫేం కీర్తి సురేష్ కి ఇప్పటికే స్క్రిప్టు ను వినిపించిన బోయపాటి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని నమ్మకంగా ఉన్నాడట. ఇప్పటికే కీర్తి కోసం బోయపాటి చెన్నయ్ వెళ్లి వచ్చారు. కానీ ఇంకా తన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అయితే కీర్తి దాదాపు  ఓకే అనే అవకాశాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడి కీర్తి సీనియర్ హీరో చియాన్ విక్రం సరసన నటించింది. కాబట్టి బాలయ్య సినిమాకి సై అంటుందనే టాక్ వినిపిస్తుంది. కీర్తి ఓకే అంటే చిత్రబృందానికి శ్రమ తప్పుతుంది లేదంటే మరో హీరోయిన్ వెతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఎంతమంది హీరోయిన్స్ అవసరమో బోయపాటి ఇంకా రివీల్ చేయలేదు.

 

మరోవైపు కెజీఎఫ్ 2లో అధీరా పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎన్ బీకే 106 లో విలన్ గా నటించాల్సిందిగా బోయపాటి సంప్రదించారని ప్రచారమైంది. మున్నాభాయ్ అంగీకరించారా లేదా? అన్నది ఇంకా క్లారిటి లేదు. డిసెంబర్ 6న సినిమా మొదలైంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి కంటిన్యూస్ గా షెడ్యూల్స్ పూర్తి చేస్తారట. 2020 వేసవి లో రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్. అందుకు తగ్గట్టే బోయపాటి బృందం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక ఈ భారీ సినిమాని మిరియాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. మిరియాల రవీంద్ర రెడ్డి-బోయపాటి కాంబినేషన్ లో జయ జానకి నాయక సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: