ఏ.ఎం.రత్నం నిర్మించిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో అందాల త్రిష సౌత్ సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా సక్సస్ అవకపోయినా త్రిష మాత్రం నటనలో తనదైన ముద్రను వేసింది. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు త్రిష సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపుగా 12 సంవత్సరాల పాటు త్రిష స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. కాని ఈ మధ్య కాస్త ఈ అమ్మడి జోరు తగ్గింది. ఇక త్రిష పనైపోయిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ మంచి అవకాశాలతో ఊపందుకుంది. రజినీకాంత్ సినిమాలో నటించడంతో మళ్లీ బాగా బిజీ అవుతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రిష వరుసగా రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ని దక్కించుకున్నట్టుగా తాజా సమాచారం. 

 

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిషను సంప్రదించారని.. చిరంజీవితో సినిమాకు త్రిష వెంటనే ఓకే చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది కూడా. చిరంజీవి 152వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతుండగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపతున్నట్లుగా చిత్ర యూనిట్ నుండి సమాచారం.

 

ఇక మెగాస్టార్ చిరంజీవితోనే కాకుండా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తో కూడా త్రిష నటించేందుకు రెడీ అవుతుందట. జీతూ జోషెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా దృశ్యం సినిమా వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా మలయాళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో ఈ త్రిషకి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశం ఉందని త్రిష ఫ్యాన్స్ అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం త్రిషకు కేవలం సీనియర్ హీరోల సరసన ఛాన్స్ వస్తుందంటే ఇక తన వయసైపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా అది కరెక్టే కదా..! 

మరింత సమాచారం తెలుసుకోండి: