విక్టరీ వెంకటేష్ కొన్నేళ్ల క్రితం కలియుగ పాండవులు అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయన తండ్రి డి రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం దక్కించుకున్నారు. ఇకపోతే తండ్రి ప్రోత్సాహంతో హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్, తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ తరువాత లక్షలాది అభిమానులను సంపాదించుకుని విక్టరీ వెంకటేష్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 

 

ఒకానొక సమయంలో వరుసగా ప్రతి ఒక్క సినిమాతో హిట్స్ కొడుతూ ముందుకు సాగుతున్న వెంకటేష్ కు అదే సమయంలో విక్టరీ వెంకటేష్ అనే పేరు రావడం జరిగింది. ఇక వెంకటేష్ తన సినిమాల్లో ప్రత్యేకించి చేసే కామెడీ మరియు యాక్షన్ సీన్స్ కు పలు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా పొగడ్తలు కురిపిస్తుంటారు. ఇక తొలిసారిగా తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ప్రస్తుతం వెంకీ మామ అనే సినిమాలో నటిస్తున్న వెంకటేష్, నిన్న జరిగిన వెంకీ మామ ప్రీ రిలీజ్ వేడుకలో ఒకింత ఉద్వేగ భరితంగా మాట్లాడారు. 

 

తాను ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, నా మేనల్లుడు చైతు తో చేస్తున్న వెంకీ మామ మరొక ఎత్తని, తనతో కలిసి చైతు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి అత్యద్భుతంగా నటించాడని, ఈ విధంగా తనతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ మూవీ తనకు సినీ జీవితం మొత్తంలో ఒక మెమొరబుల్ మూవీ గా మిగిలిపోతుందని వెంకటేష్ అన్నారు. ఇక దర్శకుడు బాబీ సినిమాను ఎంతో ప్రాణం పెట్టి తెరకెక్కించాడని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత సినిమా ప్రేక్షకులను మరియు దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఇక ఈ సినిమా ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: