మహేశ్ బాబుకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.. సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. బాలనటుడిగానే తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి వచ్చిన మహేశ్ చిన్నప్పుడే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. కొడుకుదిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, బాలచంద్రుడు సినిమాలతో తానేంటో 80వ దశకంలోనే నిరూపించుకున్నాడు. ఆయా సినిమాల్లో చేసిన డ్యాన్సులకు ఘట్టమనేని అభిమానులు ఫిదా అయిపోయారు. తండ్రికి తగ్గ వారసుడు అనుకున్నారు. కానీ.. మహేశ్ లో చిన్నప్పుడు ఉన్న ఓ టాలెంట్ ఇప్పుడు లేదనేది ఫ్యాన్స్ కూడా ఒప్పుకునే నిజం. ఇప్పుడు వస్తున్న సరిలేరు నీకెవ్వరులో ఆ అంశంపైనే దృష్టి పెట్టాడని టాక్.

 

 

కొడుకు దిద్దిన కాపురంలో మహేశ్ చేసిన బ్రేక్ డ్యాన్స్ అప్పట్లో ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. హీరో అయ్యాక ఆయన డ్యాన్సుల్లో గ్రేస్ తగ్గింది. చాలా సినిమాల్లో మహేశ్ డ్యాన్స్ ట్రోలింగ్ కు గురైంది. దీంతో.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో డ్యాన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడని అంటున్నారు. ఇందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రెషర్ ఎక్కువగా ఉందని సమాచారం. డ్యాన్స్ మాస్టర్ గా శేఖర్ మాస్టర్ చేత మహేశ్ వేసే స్టెప్పులే కాకుండా వెరైటీ డ్యాన్స్ మూమెంట్స్ ను చేయించారట. వాటిని మహేశ్ స్టైల్లో స్క్రీన్ పై ప్రెజెంట్ చేయించారట. దీంతో సరిలేరు నీకెవ్వరులో మహేశ్ డ్యాన్స్ 'మైండ్ బ్లాక్' గా నిలువనుందని యూనిట్ వర్గాల వారి సమాచారం.

 

 

సినిమా సినిమాకు మహేశ్ రేంజ్ పెరుగుతుంటే డ్యాన్సుల్లో మాత్రం మార్పు రావటం లేదు. దీనిపై ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. రొటీన్ మ్యూజిక్ కూడా మహేశ్ కు ప్రతిబంధకంగా మారుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవీ కూడా మ్యూజిక్ పై శ్రద్ధ పెట్టాడని అంటున్నారు. మరి.. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: