సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తోంది. వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. 'భరత్ అనే నేను' మరియు 'మహర్షి' రెండు సినిమాలు అతను కొట్టే రీతిలో కలెక్షన్లు సాధించి మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచిపోవడంతో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించి మరొకసారి అభిమానుల కాలర్ మహేష్ బాబు ఎగరేసలా చేస్తాడు అని మహేష్ అభిమానులు ఈ సినిమా విజయం పట్ల చాలా ధీమాగా ఉన్నారు.

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు మరియు టీజర్ అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన మొదటి సాంగ్ మాస్ సాంగ్ రిలీజ్ అయ్యి అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ఇంకో సాంగ్ రిలీజ్ చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా సినిమా రిలీజ్ డేట్ రోజు రోజుకి దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ విషయంలో ఇప్పటికే చాలా స్లో గా ఉండటంతో ఇటీవల ప్రతి సోమవారం సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడంతో రాబోయే సోమవారం నాడు సినిమాలో రెండో పాట విడుదల చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

 

ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తామని చెప్పినట్టే.. రెండో పాటను కూడా వచ్చే సోమవారం రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ సినిమా నుండి సూర్యుడో.. చంద్రుడో పాటను రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.  జనవరి 11 వ తారీకున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వటంతో సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: