మహేశ్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది యూనిట్. ఇప్పటికే ప్రతి సోమవారం ఓ సర్ ప్రైజ్ అంటూ పాటలు విడుదల చేస్తోంది. ఆలెక్కన చూసుకుంటే ఈ నెల 30తో పాటల విడుదల అయిపోతుంది. తర్వాత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 5న అనుకుంటున్నారు.

 

 

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుపుతారో అని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. భరత్ అనే నేను సినిమాతో ఓ కొత్త ఒరవడి సృష్టించిన మహేశ్ ఈ సినిమాకు కూడా అదే పద్ధతిని పాటిస్తాడా అని అనుకుంటున్నారు. ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి సినిమాపై క్రేజ్ పెంచాడు. హీరోలుగా తామంతా ఒకటేనని అభిమానులు కూడా అలానే ఉండాలని ఓ మెసేజ్ ఇప్పించాడు.. ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతాడా అని ఆలోచిస్తున్నారు. ఆ సినిమా ఫంక్షన్ అయిపోయాక ఓ స్టార్ హోటల్ లో మహేశ్-ఎన్టీఆర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసిన సంగతి తెలిసేందే.

 

 

మహేశ్ కు చరణ్ తో కూడా మంచి రిలేషన్ ఉంది. కాబట్టి ఈసారి చరణ్ ను పిలుస్తాడా అని అనుకుంటున్నారు. అయితే అదే సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కూడా రిలీజ్ ఉంది. ఈ విషయాన్ని గమనిస్తే చరణ్ వచ్చే అవకాశం లేదు. మరి.. మహేశ్ ఏం చేస్తాడో ఫంక్షన్ ఎలా చేయాలనేది డిసైడ్ చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతానికి ఇవన్నీ గాసిప్సే అయినా.. అప్పటికి ఏం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: