నా పేరు సూర్య తరువాత  ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ  అల .. వైకుంఠపురములో..   ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  తుది దశకు చేరుకుంది.  ఇప్పటికే  ఈచిత్రం నుండి  మూడు పాటలు విడుదలకాగా  మొదటి రెండు  పాటలు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుని  సినిమా పై అంచనాలను మరింతగా పెంచాయి. ఇక అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్  ఈనెల 11న విడుదలకానుందని సమాచారం.  రేపు  ఉదయం 10గంటలకు ఈటీజర్ గురించి అధికారిక  అప్డేట్  వెలుబడనుంది. 
 
  
 
స్టార్ డైరెక్టర్  త్రివిక్రమ్ డైరెక్షన్  లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  బన్ని కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా టబు, జయరాం , మురళీ శర్మ , సునీల్ ,నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక బన్నికి తెలుగు తో పాటు మళయాలం లో కూడా ఫ్యాన్స్ వున్న సంగతి తెలిసిందే. దాంతో  ఈచిత్రం  తెలుగు తోపాటు మళయాలం లోనూ విడుదలకానుంది.  కాగా బన్ని -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్లు  అయ్యాయి.  మరి  ఈ అల... వైకుంఠపుములో  వీరిద్దరికి  హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈసినిమా  తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు. సుకుమార్  తో  కూడా  అల్లు అర్జున్  సినిమా చేయనుండడం  ఇది  మూడో సారి.   

మరింత సమాచారం తెలుసుకోండి: