తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాకుండా భారతదేశ ప్రజలు అందరికీ షాక్ ఇచ్చిన దిశ ఎపిసోడ్ బాలకృష్ణ బోయపాటి మూవీలో ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న శుక్రు వారం ప్రారంభం అయిన ఈ మూవీ ప్రారంభోత్సవంలో దర్శకుడు బోయపాటి ఈ విషయమై తనకు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులకు ఈ లీకులు ఇచ్చినట్లు సమాచారం. 

దిశ జ్ఞాపకాలు పూర్తిగా జనం మరిచి పోకుండా ఈ మూవీని చాల వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ రేసులో ఈ మూవీని నిలపాలని బోయపాటి చాల స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు టాక్. ఈ మూవీలో బాలకృష్ణ ఆవేశ పరుడైన జెంటిల్మన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. 

సాధారణంగా బోయపాటి సినిమాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారి పై గౌరవం పెరిగేలా సన్నివేశాలు బోయపాటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ విధానాన్ని బోయపాటి తన లేటెస్ట్ మూవీలో కూడ అనుసరిస్తూ దిశ పాత్రను తన మూవీ కథలో ఒక కీలక ట్విస్ట్ గా మార్చిమూవీ చూసే వారికి దిశ అడుగడుగునా గుర్తుకు వచ్చేలా బోయపాటి తన మార్క్ ప్రతిభతో ఈ మూవీలో సీన్స్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’ చిత్రం లో అప్పట్లో సంచలనం సృష్టించిన వరంగల్ యాసిడ్ దాడి సంఘటనలను ఆ మూవీ కథలో తెలివిగా ఇరికించినట్లుగా ఇప్పుడు దిశ సంఘటనను బాలయ్య మూవీలో బోయపాటి హైలెట్ చేయబోతున్నాడని టాక్. 

దిశ హత్య అనంతరం జరిగిన ఎన్ కౌంటర్ విషయాలను ఆ దృశ్యాలను యథాతధంగా బాలయ్య బోయపాటిల లేటెస్ట్ మూవీలో ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న కొన్ని రాజకీయ సంఘటనలు కూడ ఈ మూవీలో పరోక్షంగా చూపెడుతూ ఆవేశ పూరితుడైన బాలయ్య పాత్ర విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపెడుతూ తెలుగు ప్రేక్షకులకు బాలయ్యలో కనిపించ ఒకనాటి ‘సమర సింహా రెడ్డి’ ఫైర్ ను వెండి తెర పై చూపెడుతూ  బాలయ్య అభిమానుల కోరిక తీర్చబోతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: