బాహుబలి సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ స్థాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది...సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నాడు.. అందుకే ఫాన్ ఇండియా హీరోగా కూడా కొత్త అవతారం ఎత్తారు.. అది ప్రభాస్ మార్కెట్..ఇక ఈయన ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

 

దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఒక్క హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో ఈ సినిమాకు నష్టాలు రావటంతో తదుపరి చిత్రాల విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సాహో రిలీజ్‌కు ముందే నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్‌.

 

జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమా ఎక్కువగా ఇటలీలో చిత్రీకరణ జరగనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.

 

ముందుగా ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. అందుకోసం ఇటలీలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. ప్రభాస్‌ పాత్ర కోసం పెద్ద ఎత్తున వింటేజ్‌ కార్లను కూడా తీసుకువచ్చారు. అయితే సాహో రిజల్ట్‌ తరువాత నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కాకుండా కాస్త లిమిటెడ్‌ బడ్జెట్‌లోనే సినిమా చేస్తే బెటర్ అని భావిస్తున్నారు భారీ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా ఎలాగో రెండు రోజులు కూడా అడలేదు..

 

ప్రస్తుతం అదే జోనర్ లో మరో సినిమా చేస్తున్నాడు.. అదే జాన్ మరి ఈ సినిమా అన్న హిట్ అవుతుందా లేక సాహో లాగా దుకాన్ సర్డుతుందేమో చూడాలి.. ఎది ఏమైనా ఇలాంటి సినిమాలు తీయాలంటే అది ప్రభాస్ కే సొంతం.. సినిమాను ఎప్పుడు జీవితంగా ప్రభాస్ చూస్తుంటాడు...మరీప్పుదన్న హిట్ ను ఖాతాలో వేసుకుంటాడు అని ఆశిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: