తెలుగు లో పరిచయం అక్కర్లేని దర్శకుడు సుకుమార్.. మాస్, ఫ్యామిలీ కథలను తెరకెక్కించడం తో సుకుమార్ తర్వాతే ఎవరైనా.. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి  ఆయన ఎన్నో సినిమాలను అందుంచాడు. ఆ సినిమాలన్నీ మంచి విజయాలతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాలే కావడం విశేషం. ఈ మధ్య కాలం లో సుకుమార్ తెరకె క్కించిన సినిమా రంగ స్థలం ఎంత హిట్ అయిందో తెలిసిన విషయమే. అయితే, అదే విదంగా మరొక కథతో సినిమాను తెరకెక్కించ బోతు న్నాడు.

 

 ఆ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మద్యే పూజ కార్యక్రమాల తో పారరంభమైన ఈ చిత్ర షూటింగో త్వరలోనే సెట్స్ పై వెళ్లనుందని వార్తలు వినపడు తున్నాయి.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురము లో నటిస్తున్నారు. పూజ హెగ్డేసినిమా లో కథానాయికగా నటిస్తుంది. వీరిద్దరి కామినేషన్లో వస్తున్నా ఈ సినిమా త్వరలో నే విడుదల కాబోతుంది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది..  

 

సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, అల్లు అర్జున్ వచ్చేలోపు ఈ సినిమాను మొదలెడితే బాగుండు అనుకున్న సుకుమార్.. షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా లో బన్నీ స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ కొత్త లుక్ కోసం బన్నీ కొద్దిరోజులు గ్యాప్ తీసుకోనున్నాడని వార్తలు వినపడుతున్నాయి.

 

బన్నీ లేకపోయినప్పటికీ కేరళలో బుధవారం నుంచి షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నాడట. హీరో ప్రమేయం లేని ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తాడట. కొన్ని రోజుల తర్వాత బన్నీ జాయిన్ అవుతాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: