‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ కు సంబంధించి రెండవ సోమవారం రేపు రాబోతోంది. ఇప్పటికే గత సోమవారం విడుదలైన ‘మైండ్ బ్లాంక్’ సాంగ్ హిట్స్ పరంగా సంచలనాలు క్రియేట్ చేసినా ఈపాట ట్యూన్ యూత్ కు పూర్తిగా నచ్చక పోవడంతో దేవిశ్రీ ప్రసాద్ పై విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి. 

ప్రస్తుతం దేవిశ్రీ తో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో రేపు సోమవారం ఈ మూవీకి సంబంధించి విడుదల కాబోతున్న రెండవ పాట విశేషాలను తెలియ చేస్తూ ఈ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేసారు. 

‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగే ఈ పాట పొలాల మధ్య తీసినట్లు కనిపిస్తోంది. ముందుగా మహేష్ నడుస్తుంటే అతడి వెనుక విజయశాంతి రాజేంద్రప్రసాద్ లు మహేష్ అడుగుజాడలలో నడుస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్ విడుదలైన కొద్ది సేపటికే ఇంకా విడుదల కాని ఈ పాట పై సెటైర్లు పడిపోతున్నాయి. ఈ పాట చిత్రీకరించిన విధానం పరిశీలిస్తుంటే ‘మహర్షి’ మూవీలో పొలాల మధ్య చిత్రీకరించిన ‘పదర పదరా’ పాట సీన్స్ గుర్తుకు వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రేపు విడుదల కాబోతున్న ‘సూర్యుడివో చంద్రుడివో’ పాట ట్యూన్ కూడ ‘మహర్షి’ మూవీలోని పాట ట్యూన్ ల ఉంటుందా అంటూ అప్పుడే జోక్స్ పడిపోతున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో రేపు విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ రెండవ పాట కూడ క్లిక్ కాకపోతే ఈ మూవీ పరిస్థితి అయోమయంలోకి వెళ్ళిపోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఇదే వారంలో ‘అల వైకుంఠపురములో’ కు సంబంధించి మరొక పాట టీజర్ విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈవారం అంతా మహేష్ బన్నీల సినిమాల మధ్య వార్ కొనసాగుతూనే ఉండి వీరి అభిమానుల మధ్య చిచ్చు రేపుతూనే ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: