ఒక పక్క దిశా లాంటి ఘటనలు సంచలనం సృష్టిస్తుంటే మరోపక్క కొందరు మహిళలు తమ కోరికలతో దారుణాలకు ఒడికడుతున్నారు. దిశా ఘటనతో దేశం మొత్తం ఉదికిపోగా నిందితుల ఎన్ కౌంటర్ పై ఎక్కువమంది న్యాయం జరిగిందని అనగా.. కొంతమంది మాత్రం వాళ్ళను ఎన్ కౌంటర్ చేయాల్సింది కాదని అన్నారు. అయితే ఇక ఇప్పుడు కొత్తగా రెంటుకి ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఏకంగా భర్తను కడతేర్చిన ఒక మహిళ గురించి వార్త సంచలనంగా మారింది.

 

కడప జిల్లాలోని రామ్ నగర్ లో పెళ్ళైన రెండు నెలలకే భర్తను కిరాతకంగా చంపేసింది గౌరీ అనే మహిళ. ప్లంబర్ పని చేస్తున్న అనంత రెండు నెలల క్రితమే గౌరిని పెళ్ళాడాడు. కడప రామ్ నగర్ లో సొంత ఇంట్లోనే వాళ్ళు ఉంటారు. అయితే ప్లంబర్ గా చేస్తున్న అనంత్ భార్య లక్సరీ కోరికలు తీర్చలేకపోయాడు. ఈలోగా ఇంట్లోకి రెంట్ కి దిగిన కృష్ణ మీద మనసు పడ్డది గౌరి.

 

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కృష్ణ గౌరిలి వివాహేతర సంబందం ఏర్పరచుకున్నారు. భర్త బయటకు వెళ్ళడమే ఆలస్యం కృష్ణ, గౌరిలు కలవడం జరిగేదట. అయితే తనకు పడక సుఖం ఇస్తున్న గౌరికి కృష్ణ కానుకలు ఇచ్చాడట. ఇంట్లోకి కొన్ని సామాన్లు కొనిచ్చాడట.. వాటిని చూసి డౌట్ వచ్చిన అనంత్ గట్టిగా నిలదీస్తే రెంటుకి ఉంటున్న కృష్ణ కొనిచ్చాడని తెలుసుకున్నాడు. అయితే ఒకసారి మందలించి వదిలిపెట్టిన అనంత్ తమ వివాహేతర సంబందానికి అడ్డుపడుతున్నాడని నిద్రపోతున్న అనంత్ ను కృష్ణ సహాయం తీసుకుని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది గౌరి. అయితే వాళ్ళే కావాలని చంపి హార్ట్ ఎటాక్ అన్నట్టుగా కవర్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ జరుపగా విషయం బట్టబయలు అయ్యింది. పెళ్లై రెండు నెలలు కాకముందే భర్తని కడతేర్చిన గౌరికి ఎలాంటి శిక్ష వేస్తారో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: