టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదంతో ఆయన తరువాత సినిమాల్లోకి హీరోగా ప్రేవేశించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటీవల జనసేన పేరుతో పార్టీ ని ప్రారంభించి రాజకీయాల్లో బిజీ కావడం జరిగింది. కాగా అతి త్వరలో ఆయన కూడా మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్

 

వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ ఎప్పటికప్పుడు తమ సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తుండగా అతి త్వరలో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని మొన్నటి సాయి ధరమ్ తేజ్ వరకు ఆ కుటుంబంతో ఎంతో మంచి సన్నిహితుడైన నూర్ భాయ్ అనే అభిమాని నేడు అనారోగ్యంతో అకాల మరణం పొందడంతో మెగా ఫ్యామిలీ మొత్తం నేడు విషాదంలో మునిగిపోయింది. కొన్నేళ్ల నుండి తమకు ఒక అభిమానిగానే గాక, మంచి కుటుంబసభ్యుడిగా కూడా వ్యవహరించిన నూర్ భాయ్, 

 

ఈ రోజు మా నుండి దూరంగా వెళ్లిపోవడం ఎంతో బాధగా ఉందని మెగా హీరోలు బాధపడుతున్నారు. అందుకే నేడు రిలీజ్ కావలసిన అలవైకుంఠపురములో ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా వాయిదా వేశారు. ఇక ఈ ఘటనతో మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ సహా మిగతా మెగా హీరోలందరూ కూడా నూర్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించినట్లు తెలుస్తోంది. మొదటి నుండి నూర్ భాయ్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టారని, అలానే ఎప్పుడైనా మెగా ఫ్యాన్స్ మధ్య ఏవైనా సమస్యలు వస్తే, అన్ని తానై ముందుండి వాటిని దగ్గరుండి పరిష్కరించేవారని మెగాస్టార్ కూడా గుర్తు చేసుకుని బాధ పడ్డట్లు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: