‘జబర్దస్త్’ షో నుండి బయటకు వచ్చిన తరువాత నాగబాబు తాను ఆ షో నుండి ఎందుకు బయటకు రావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయో వివరణ ఇస్తూ అనేక వీడియోలు విడుదల చేసాడు. అంతేకాదు ఈ షోలో జరుగుతున్న రాజకీయాల గురించి ముఖ్యంగా ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్స్ జరుగుతున్న అన్యాయాల గురించి అక్కడ లోపించిన సౌకర్యాల గురించి వాస్తవాలను వివరిస్తూ నాగబాబు వీడియోలు విడుదల చేయడంతో ‘జబర్దస్త్’ షో నిర్వాహకులు హైపర్ ఆది ద్వారా వ్యూహాత్మకంగా ఈ సెటైర్లు వేయించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 


‘జబర్దస్త్’ షోలో జడ్జిగా నాగబాబు కొనసాగుతున్నంత సేపు ఆయనను విపరీతంగా పొగిడిన హైపర్ ఆది ఇన్ డైరెక్ట్ గా నాగబాబును టార్గెట్ చేస్తూ తన లేటెస్ట్ స్కిట్ లో వేసిన డైలాగ్స్ సెటైర్లను చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. హైపర్ ఆది ప్రజెంట్ చేసిన ఒక స్కిట్ లో ఒక పాత్రధారి ''అరేయ్ మనం ఎప్పుడు ఇలాగే కలసి ఉండాలిరా అంటే.. వెంటనే హైపర్ ఆది ఏడేళ్లుగా కలసిన వారు విడిపోతున్నారు మూడేళ్లది.. బొక్క మన రిలేషన్ ఎంత'' అంటూ రివర్స్ పంచ్ వేస్తాడు. 

ఇది చాలదు అన్నట్లుగా ‘జబర్దస్త్’ కమెడియన్ చలాకి చంటి కూడా నాగబాబుపై అదిరిపోయే సెటైర్ వేశాడు. 'ఇక్కడ వేరే రాజు ఉండాలి కదా' అంటూ ఒక కంటెస్టెంట్ అడిగితే ఆయనకు 'ఇక్కడ భోజన వసతులు బాగోలేవని వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు' అంటూ సెటైర్ వేశాడు. దీనితో ఈ సెటైర్లు అన్నీ నాగబాబును టార్గెట్ చేసేవిగా ఉన్నాయని ఈ కార్యక్రమాన్ని చూసిన బుల్లితెర ప్రేక్షకులు భావిస్తున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు నాగబాబు వెళ్ళిన తర్వాత కూడా జబర్దస్త్ కామెడీ షో రేటింగ్ అనేది అలాగే మెయింటైన్ అవుతుండటం నాగబాబుపై సెటైర్స్ పడుతుండటంతో పాటు నాగబాబు పై ఇలా వరస పెట్టి సెటైర్లు పడుతూ ఉండటంతో చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఈ విషయాలు అన్నీ నాగబాబు దృష్టి వరకు వెళ్ళడంతో జరుగుతున్న పరిణామాల పై నాగబాబు చాల అసహనంలో ఉన్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: