స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అలా వైకుంఠ పురం లో’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు యూట్యూబ్ ఛానల్ లో మరియు సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూడో సినిమా కచ్చితంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అల్లు అర్జున్ అభిమానులు సినిమా విజయం పట్ల చాలా ధీమాగా ఉన్నారు.

 

అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పాటలు సంగీత ప్రియులను మరియు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న క్రమంలో స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉన్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్న తరుణంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పడుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయి సోషల్ మీడియాలో కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు.

 

ఇదిలావుండగా సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘అలా వైకుంఠపురం లో’ సినిమా యూనిట్ చాలా వెరైటీ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో చేయాలని అలా వైకుంఠపురం లో సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించి అక్కడ ముఖ్య అతిథిగా చిరంజీవిని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ నగరంలో మరొక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యఅతిథిగా పిలవాలనే ఆలోచనలో అలా వైకుంఠపురం లో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: