కథపై క్లారిటీగా ఉంటేనే సూపర్ హిట్లు వస్తాయి. కానీ కె.జి.ఎఫ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ నీల్ మాత్రం కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. సెక్స్ట్ ఏంటన్నది తేల్చుకోలేకపోతున్నాడు. వీరి వీరి గుమ్మడిపండు ఆడుతున్నట్టు ముగ్గురు తెలుగు స్టార్స్ చుట్టూ తిరుగుతున్నాడు. 

 

కె.జి.ఎఫ్ సూపర్ హిట్ తో ఇండియా వైడ్ గా పాపులారిటీగా తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ కన్నడ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు తెలుగులో చాలామంది స్టార్లు ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళ, హిందీ పరిశ్రమల నుంచి ప్రశాంత్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ దర్శకుడు మాత్రం నెక్స్ట్ ఏంటన్నది తేల్చుకోలేకపోతున్నాడు. 

 

ప్రశాంత్ నీల్, మహేశ్ బాబుని కలిశాడని, స్టోరీ నెరేషన్ కూడా ఇచ్చాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అని టాక్ వచ్చింది. అయితే ఈ మాటలు కూడా రిలీజ్ కు నోచుకోని సినిమాలా డబ్బాల్లో ఇరుక్కుపోయింది. 

 

ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ప్రభాస్ కలిశాడని, ఓ లైన్ చెప్పాడనే టాక్ వస్తోంది. ఇక బాహుబలి తర్వాత నేషనల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తోన్న డార్లింగ్, ప్రశాంత్ తో సినిమా ఓకే చేశాడనే ప్రచారం జరుగుతోంది. మరి కిడ్డీలో ఓ బ్లాక్ బస్టర్, బ్రిలియంట్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు ప్రశాంత్ ఇంతమందిని ఎందుకు కలుస్తున్నాడు. అంటే ఈయన తెచ్చిన కథలు హీరోలు మెచ్చట్లేదా.. లేక హీరోలే ఈ దర్శకుడిని సైడ్ చేస్తున్నారా.. అనేది ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి ప్రశాంత్ నీల్ ఫుల్ కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. ఏమి చేయాలో పాలుపోక సతమతమవుతున్నాడు. ప్రశాంత్ హీరోలు క్లారిటీ ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. ప్రశాంత్ నీల్ ని హీరో నమ్మట్లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: