సినిమాకి పైరసీ చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడం సినిమా వారి పాలిట ఇబ్బందిగా మారింది. ఒక్కోసారి సినిమా రిలీజ్ అవకుండానే ఆన్ లైన్లోకి వచ్చేస్తుంది. పైరసీ భూతాన్ని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మళ్ళీ మళ్లి ఇండస్ట్రీని భయపెడుతూనే ఉంది. అయితే తాజాగా ఒక సినిమా పైరసీ సీడీలని ఆ సినిమా హీరో పట్టుకున్నాడు.

 

యంగ్ హీరో నిఖిల్ నటించిన "అర్జున్ సురవరం" ఈ మధ్యే థియేటర్లలో విడుదల అయింది. ఎన్నో అష్ట కష్టాల మధ్య విడుదల అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే సినిమాకు మాత్రం కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద మరే సినిమాలు లేకపోవడం అర్జున్ సురవరం సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పైరసీ సీడీలు విచ్చల విడిగా దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 

తాను నటించిన అర్జున్ సురవరం ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే.. సీడీలు విక్రయిస్తున్న తోపుడు బండిని డైరెక్టుగా వీడియో సాక్షిగా చూపించాడు. రాజుగారి గది.. అర్జున్ సురవరం సహా ఇటీవల రిలీజైన సీడీలు అన్నీ ఆన్ రోడ్ షాప్ లో అమ్మేస్తున్నారు. ఇక ఆ సీడీలు అమ్మే ఆవిడను నిఖిల్ పబ్లిగ్గా పట్టుకుని సినిమావాళ్ల బాధల్ని వివరించి చెప్పిన తీరు బావుంది. రూ.40 కే మూడు సినిమాలు ఒకే సీడీలో లభ్యమవుతున్నాయి. 

 

ఓవైపు సినిమా థియేటర్లలో బాగా ఆడుతోందన్న ఆనందం ఉంది. మరోవైపు ఇలా సీడీలు అమ్మేస్తున్నారు! అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిఖిల్. రోడ్ లో టీ తాగేందుకు ఆగి నడిరోడ్డుపై తోపుడు బండిపై ఉన్న సీడీ షాప్ ని పట్టుకోవడం ఆసక్తికరం.  అలాగే ఆమెకు సినిమా వాళ్ళ గురించిన కష్టాలు వివరించి, ఇలా పైరసీ సీడీలు అమ్మడం కరెక్ట్ కాదని వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: