కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఫ్రాబ్లమ్. అతి విశ్వాసంతో ఎక్కువగా మాట్లాడితే నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇలాగే ఓవర్ గా మాట్లాడి అడ్డంగా బుక్ అయింది. ఏడుపులకు కేరాఫ్ గా నిలుస్తోంది. 

 

మర్ జావా రిలీజ్ టైమ్ లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా మాట్లాడింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ హైలెట్ గా ఉంటుందనీ.. ఆడియన్స్ షాక్ అవుతారని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక ఆమె చెప్పినట్టే రకుల్ యాక్టింగ్ కు నార్త్ ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుండా వుడెన్ ఫేస్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ ఎలా అయ్యిందని విస్తుపోయారు. 

 

మర్ జావా సినిమాలో రకుల్ వ్యాంప్ పాత్ర పోషించింది. స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువ. అయితే క్యారెక్టర్ కనిపించేది తక్కువసేపే అయినా.. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకుంది. అంతేకాదు సింకదర్ కా ముకద్దర్ సినిమాలో రేఖ పాత్రలా ఆకట్టుకుంటుందని ఇంటర్వ్యూలు ఇచ్చింది. కానీ మర్ జావా రిలీజ్ అయ్యాక రివ్యూలన్నీ రకుల్ కు నెగిటివ్ గా వచ్చాయి. 

 

మర్ జావాలో రకుల్ కనీసం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేదని, ఉడెన్ ఫేస్ అని చాలా ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో పాటు రేఖాతో పోల్చుకోవడంపైనా సెటైర్లు వస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే సౌత్ లో అవకాశాల్లేని రకుల్ కు ఈ మర్ జావా రివ్యూస్ తో బాలీవుడ్ ఆశలకు షట్టర్స్ క్లోజ్ అవుతున్నాయి అంటున్నారు. అయితే చేతిలో ఉన్న అర్జున్ కపూర్ సినిమా హిట్ అయితే రకుల్ కష్టాలు కొంతమేర తగ్గే అవకాశముంది. రకుల్ ప్రీత్ సింగ్  మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని నెటిజన్లు అంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోకుండా నార్మల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: