టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఇకముందు తెలుగు స్టార్స్ తో నటించకపోవచ్చు. ఈ అమ్మడి డేట్సే కావాలంటే ఓ ఏడాది వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నటిస్తున్న అల వైకుంఠపురములో షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ మూవీ ఇపుడు మొదలవుతోంది తెలియదు. అఖిల్ తో నటిస్తున్న చిత్రం షూటింగ్ నడుస్తోంది. ఈ మూవీ పూర్తికాగానే.. పూజా టాలీవుడ్ కు దూరం కానుంది. 


ఐరెన్ లెగ్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. ప్రస్తుతం గోల్డెన్ లెగ్ హీరోయిన్. సాధారణంగా ఒకటి రెండు హిట్స్ వస్తేనే ఇమేజ్ పెరిగిపోతుంది. వరుసగా నాలుగు హిట్స్ తో దూసుకుపోతూ.. డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసింది. అల వైకుంఠపురములో.. అఖిల్ మూవీ కూడా హిట్ అయితే.. అరుదైన డబుల్ హ్యాట్రిక్ ఫీట్ అందుకుంటుంది పూజా. 


పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయింది. ఈ ఏడేళ్ల నుంచి కంటున్న ఏకైక కలను ఈ ఏడాది తీర్చుకుంది. 2012లో మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన పూజా మొహింజదారాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. డెబ్యూ మూవీ ఫ్లాప్ కావడంతో.. రెండో ఛాన్స్ రావడానికి మూడేళ్లు పట్టింది. ఆమె నటించిన బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ హౌస్ ఫుల్ 4కు ఫ్లాప్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ ను మెప్పించింది. 200కోట్ల మార్క్ దాటేసింది. హౌస్ ఫుల్ 4తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న పూజాను మరో రెండు హిందీ ఛాన్సులు వరించాయి. 

 

హిందీలో రెండు సినిమాలు చేస్తున్నట్టు పూజా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఒక సినిమాను సాజిద్ నడియద్ వాలా నిర్మిస్తున్నారని చెప్పింది. మరో మూవీని తను ఎనౌన్స్ చేయకూడదని.. ప్రొడక్షన్ సంస్థే త్వరలో ప్రకటిస్తుందని చెప్పింది పూజా. ఈ లెక్కన అఖిల్ తో మూవీ పూర్తి కాగానే.. తెలుగు పెద్ద ఆఫర్స్ వచ్చినా చేయలేని పరిస్థితి. బాలీవుడ్ లో సెటిలవ్వడానికి టాలీవుడ్ కు దూరమవుతోందని ఈ టాప్ హీరోయిన్. 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: