ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' భారీగా ప్రేక్షకాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే.  బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సీరీస్ తో కియారాకు భారీగా క్రేజ్ దక్కింది. ఈ లస్ట్ సీరీస్ ను ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సీరీస్ కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ఒక సంచలనమైన వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఒకరు మిడిల్ డ్రాప్ అయినట్టు సమాచారం. 

 

నందిని రెడ్డి.. సంకల్ప్ రెడ్డి.. తరుణ్ భాస్కర్..సందీప్ రెడ్డి వంగా ఈ సీరీస్ కు దర్శకులుగా నెట్ ఫ్లిక్స్ వారు ఎంచుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సందీప్ వంగా ఈ సీరీస్ నుంచి తప్పుకున్నాడని లేటెస్ట్ న్యూస్. దీంతో మరో దర్శకుడి కోసం పలు పేర్లు పరిశీలించిన తర్వాత సందీప్ వంగా స్థానంలో నాగ్ అశ్విన్ ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే నాగ్ అశ్విన్ ఈ లస్ట్ సీరీస్ కు సంబంధించిన షూటింగులో పాల్గొంటారట. 

 

నాగ్ అశ్విన్ ఇప్పటివరకూ తెరకెక్కించిన సినిమాలన్నీ క్లాసిక్ ఫిలిమ్స్. మహానటి తో ఒక్కసారిగా నాగి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శక, నిర్మాతలు, సీనియర్ స్టార్ హీరోలందరి ప్రశంసలను అందుకున్నాడు. వాస్తవంగా నాగీ కి మహనటి కేవలం రెండవ సినిమా మాత్రమే. అయినా సావిత్రి జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించి ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఈ సినిమా తర్వాత నాగీ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ లస్ట్ స్టోరీస్ బోల్డ్ స్టైల్ లో ఉంటాయి. మరి నాగ్ అశ్విన్ ఇలాంటి బోల్డ్ కథలను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఏదేమైనా నెట్ ఫ్లిక్స్ వారు మహానటి దర్శకుడికి పెద్ద టాస్క్ ఇచ్చినట్టే. మరి నాగీ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: