హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్దార్ధ, ఆ తరువాత మెల్లగా ఒక్కోక్కటిగా తన వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాడు. అయితే కెరీర్ మొదట్లో సరైన సినిమాలు ఎంచుకోలేక కొంత తడబడ్డ నిఖిల్, ఇటీవల కాలంలో మంచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. నిజానికి ఈ సినిమా విజయానికి మెగాస్టార్ అందించిన బూస్ట్ కూడా కొంత కారణం అని అంటోంది సినిమా యూనిట్. తమ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్, సినిమాను తనవంతుగా ప్రమోట్ చేసారని, 

 

అందువల్లనే ఒకరకంగా నేడు తమ సినిమా మెజారిటీ ప్రజలకు రీచ్ అయిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇక ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా నిన్న గుంటూరు మీదుగా వెళ్తున్న హీరో నిఖిల్, హఠాత్తుగా టి కోసం గుంటూరు లో దిగారు. కాగా అక్కడ టీ తాగుతున్న సమయంలో ప్రక్కనే ఉన్న చిన్న బండిపై ఒక మహిళ సిడిలు విక్రయించడాన్ని చూసి, కొంత ఆసక్తిగా ఆమె వద్దకు వెళ్లి వాటిని పరిశీలించగా, ఒక్కసారిగా ఆయనకు షాక్ తగిలింది. ఆమె దగ్గర లేటెస్ట్ సినిమాల సిడిలు అన్ని కూడా ఒక్కోటి కేవలం రూ.40 రూపాయలకే లభ్యం అవుతున్నాయి. కాగా ఆ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైన నిఖిల్

 

అక్కడి స్థానికులను సినిమా చూసారా అని అడుగగా, చూసాము సర్, కానీ సిడిలో చూసాం అని చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఈ ఘటన అనంతరం ఒక లైవ్ వీడియో చేసిన నిఖిల్, తనకు సిడిలు చూసిన వెంటనే నోట మాట రాలేదని, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎందరో కష్టపడి సినిమాలు తెరకెక్కిస్తుంటే, ఈ విధంగా కేవలం రూ.40 లకు వాటిని పైరసీ చేసి అమ్మడం నిజంగా దారుణం అని, అయితే సిడిలు అమ్మే మహిళ పరిస్థితి చూస్తే తనకు జాలి వేసిందని, అందుకే ఆమెను ఏమి అనకుండా వచ్చేసానని నిఖిల్ అన్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: