వివాదాల నటి కంగనా రనౌత్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని బాగా నమ్మేసింది. ప్రస్తుతం ఏ సినిమా చేయాలన్నా.. ఆయన సలహా సూచనలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ఆయనవే కావడం విశేషం. కంగనాను అంతగా ఇంప్రెస్ చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. 

 

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ హిందీలో ముఖ్యంగా కంగనా రనౌత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మణికర్ణికతో ఈ కాంబినేషన్ మొదలైంది. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణికకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ.. తన బయోపిక్ కు విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారని ఎనౌన్స్ చేసింది కంగనా రనౌత్. 


కంగనా రనౌత్ బయోపిక్ రెడీ కాకుండానే.. ఈమె నటిస్తున్న తలైవి మూవీకి కథ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 


కంగనా రనౌత్ ఏ సినిమా చేసినా.. కథను విజయేంద్ర ప్రసాద్ అందించాల్సిందే. రామాలయం నేపథ్యంలో అపరాజిత అయోధ్య అనే సినిమాతో కంగన నిర్మాతగా మారుతోంది. ఈ మూవీకి కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్నారు. ఇలా.. కంగన కథల విషయంలో విజయేంద్ర ప్రసాద్ ను గట్టిగా నమ్మేసింది. వివాదాల నటిగా పేరు తెచ్చుకున్న కంగన ఇలా ఓ తెలుగు రైటర్ నమ్మకం బాలీవుడ్ వర్గాలకు ఆశ్చర్యంగా ఉంది. విజయేంద్ర ప్రసాద్ కథకు బాలీవుడ్ లో సైతం మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆయన గతంలో అందించిన కథలు మంచి హిట్ టాక్ అందుకోవడంతో ఆ నమ్మకం బాలీవుడ్ ను బాగా నమ్మించింది. దీంతో బాలీవుడ్ విజయేంద్ర ప్రసాద్ ను గట్టిగా నమ్ముతోంది. అందులో భాగంగానే కంగనా సైతం ఆయనపై గట్టిగా నమ్మకం పెట్టింది. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: