రీసెంట్‌గా హైదరాబాద్ లో సంచలనం సృష్ఠించిన దిశ సంఘటనపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మొత్తం స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా దిశ నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ డిమాండ్ చేశారు. వీళ్ళతో భారత దేశ ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ సెలబ్రిటీలు అందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతా కోరుకున్నట్లుగానే దిషా నిందితులకు శిక్ష పడింది. పోలీసుల ఎన్ కౌంటర్ చేయడంతో వాళ్ళంతా కూడా మృతి చెందిన విషయం తెల్సిందే. పోలీసుల తుపాకీ తీర్పుకు చాలా మంది సెల్యూట్ చేస్తున్నారు. ఇది నిజంగా దిశ కు జరిగిన సరైన న్యాయం అంటూ సంతోష పడ్డారు.

 

ఇక తెలంగాణ పోలీసులు చేసిన పనికి సెల్యూట్ అంటూ చాలా మంది మాదిరిగానే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ట్వీట్ చేశాడు. మీరు నిజమైన హీరోలు.. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చినప్పుడు పోలీసులు వస్తారు. దేవుడు వారిని పంపిస్తాడంటూ కాస్త ఎమోషనల్ గా పూరి ట్వీట్ చేశాడు. అయితే పూరి ట్వీట్ కు కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. నీ సినిమాలో హీరోయిన్స్ ను హీరోలు వేదించడం.. విలన్స్ అమ్మాయిలను క్రూరంగా చంపేయడం వంటివి చాలా కామన్ గా చూపిస్తావు. నీలాంటి వారి సినిమాల వల్లే దిశలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ నెటిజన్స్ పూరీ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

 

మీరు చేసే ప్రతి సినిమాలో కూడా అమ్మాయిలను ఏడిపించడం లేదంటే అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయించడం చేస్తూ ఉంటారు. మీరు అలాంటివి చేసుకుంటూ దిశ నిందుతులకు శిక్ష పడటం గొప్ప విషయం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు మీరు దిశ సంఘటన గురించి మాట్లాడేందుకు అర్హులు కారు.. అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పూరి చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన వాళ్ళు కూడా లేకపోలేదు. మరి పూరి ఇప్పటి నుంచైనా తన సినిమాలో అలాంటి సన్నివేశాలు లేకుండా తన పంథా మార్చుకుంటారా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: