తెలుగు రాష్ట్రాల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను తీసిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే పొలిటికల్ సెటైరికల్ సినిమాని... డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే... ఈ సినిమాలోని సన్నివేశాలు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టె రీతిలో ఉన్నాయని సెన్సార్ బోర్డు మొదటిగా తిరస్కరించిన విషయం విదితమే. కానీ... వర్మ రివైజింగ్ కమిటీని ఆశ్రయించి... ఎట్టకేలకు అన్నీ ఆటంకాలను దాటుకొని తన మూవీ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. దీంతో... ప్రస్తుతం వర్మ కుతకుతలాడుతున్నాడు.

ఆ ఉత్సహంలోనే వరుస ట్వీట్లను చేసి... అందరి చూపును తన వైపు తిప్పుకుంటున్నాడు ఈ వర్మ.


https://mobile.twitter.com/RGVzoomin/status/1203630014761066496
మొట్టమొదటిగా... బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని మోసుకుని వస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను ఎట్టకేలకు ధియేటర్లకు తీసుకొస్తున్నట్టు చూపించాడు.


https://mobile.twitter.com/RGVzoomin/status/1203629123072954374
ఆపై మరో ట్వీట్ చేస్తూ జగన్, విజయసాయిరెడ్డి కలిసి ఉన్న ఫోటోని అప్లోడ్ చేశాడు. మార్ఫింగ్ చేసిన ఈ ఫొటోలో... 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతందని తెలుసుకున్న విజయసాయిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు చూపించాడు. ఇక ఆ ఫోటో కు కాప్షన్.. ' ఈ ఇద్దరు వ్యక్తులు నాకు తెలియదు.. వాళ్లు ఎందుకు సంతోముగా ఉన్నారో కూడా తెలియదు' అని పెట్టాడు. నిజానికి... ఈ పిక్చర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుది. వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడంలో ఈ ఇద్దరు నేతలు హగ్ చేసుకున్నారు.
https://mobile.twitter.com/RGVzoomin/status/1203629357962534912
ఇక మరొక ట్వీట్ లో తన సినిమా ప్రమోషన్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ను చూపించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

https://mobile.twitter.com/RGVzoomin/status/1203629608983248896

మరింత సమాచారం తెలుసుకోండి: