మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో ఆర్ ఆర్ ఆర్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాను నిర్మాత దాన‌య్య ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మిస్తున్నాడు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మెగా ఫ్యామిలీ లో చిచ్చు పెట్టిందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ సినిమాను రాజ‌మౌళితో చెర్రీ చేయ‌డం అల్లు అర‌వింద్‌కు ఎంత మాత్రం న‌చ్చ‌డం లేద‌న్న వార్త‌లు ఫిల్మ్‌న‌గ‌ర్లో వినిపిస్తున్నాయి. దీనికి చాలా కార‌ణాలే ఉన్నాయంటున్నారు. గ‌తంలో అల్లు అర‌వింద్ తీసిన మ‌గ‌ధీర సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అస‌లు ఆ సినిమాతోనే చెర్రీకి సూప‌ర్ స్టార్ ఇమేజ్ వ‌చ్చింది.

 

సినిమా టైంలో రాజ‌మౌళికి, అల్లు అర‌వింద్‌కు కొంత గ్యాప్ వ‌చ్చింద‌న్న టాక్ వ‌చ్చింది. దీనిని ప్ర‌త్య‌క్షంగానో లేదా ప‌రోక్షంగానో రాజ‌మౌళి కూడా చాలా సార్లు ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు అదే రాజ‌మౌళితో సినిమా చేస్తోన్న చెర్రీ త‌న‌కు క‌నీసం ఒక్క మాట కూడా చెప్ప‌క‌పోవ‌డంతో అర‌వింద్ నొచ్చుకున్నాడ‌ట‌. ధృవ సినిమాకు ముందు వ‌ర‌కు చెర్రీ సినిమాల వ్య‌వ‌హారాల‌న్ని అర‌వింద్ చూసేవాడు.. అప్ప‌టి నుంచి చెర్రీ సినిమాలు చిరు, చెర్రీయే చూసుకుంటుండడంతో అర‌వింద్‌కు, చెర్రీకి గ్యాప్ ఏర్ప‌డింద‌ని టాక్‌..?

 

ఇక త‌న‌కు ఓ సినిమా చేస్తాన‌ని చెర్రీ, చిరు ఇద్ద‌రు చెప్పినా చేయ‌డం లేదు. వీరికి అర‌వింద్ బ్యానర్లో సినిమా చేయ‌డం ఇష్టం లేకా... లేదా అన్న‌ది తెలియ‌దు కాని ఇద్ద‌రూ వాయిదాలు వేస్తున్నారు. చిరు 150 సినిమా నుంచి అన్ని రామ్‌చ‌ర‌ణ్‌తోనే చేస్తున్నాడు. ఇటు చ‌ర‌ణ్ కూడా బ‌య‌ట బ్యాన‌ర్ల‌కే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరి మ‌ధ్య గ్యాప్ ఎక్కువైంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. అటు చిరు కూడా త‌న మాట‌ను గౌర‌వించ‌లేద‌ని అర‌వింద్ ఫీల‌వుతున్నాడ‌ట‌. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఎంతో వాళ్ల‌కే తెలియాలి.

 


   

మరింత సమాచారం తెలుసుకోండి: